Dandruff : నేటి తరుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. అనేక కారణాల వల్ల ఇది వస్తుంది. ముఖ్యంగా కొందరికి అయితే చుండ్రు బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే చుండ్రును తగ్గించుకోవడం కోసం అనేక మంది రక రకాల పద్ధతులను ట్రై చేస్తుంటారు. వాటిల్లో చాలా వరకు కృత్రిమమైనవే ఉంటాయి. దీంతో ఆ పద్ధతుల్లో వాడే షాంపూలు, ఇతర క్రీముల వల్ల వాటిల్లో ఉండే కెమికల్స్ జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. కనుక అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కింద చెప్పిన పలు సహజ సిద్ధమైన పద్ధతులను ట్రై చేయండి. దీంతో చుండ్రును మరింత ఎఫెక్టివ్గా వదిలించుకోవచ్చు. మరి చుండ్రు పోవాలంటే పాటించాల్సిన ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఒక పాత్రలో 50 ఎంఎల్ మోతాదులో కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో నాలుగైదు వేపాకులు వేసి ఆ ఆయిల్ను కొద్దిగా మరగబెట్టాలి. అనంతరం దాన్ని అలాగే తీసుకుని గోరు వెచ్చగా ఉండగానే తలకు అప్లై చేసి 30 నిమిషాల వరకు వేచి ఉండి ఆ తరువాత యథావిధిగా తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు బాధ నుంచి విముక్తి కలుగుతుంది. వారంలో కనీసం 3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ మెంతులను తీసి పేస్ట్గా చేసి తలకు పట్టించాలి. 15 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు నుంచి విముక్తి కలుగుతుంది. అయితే మెంతుల పేస్ట్లో కొద్దిగా ఉసిరికాయ పొడి కూడా కలుపుకోవచ్చు. దీంతో మరింత ఎఫెక్టివ్గా ఫలితం వస్తుంది.
రైజిన్లు, బాదంపప్పును తీసుకుని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని తినాలి. ఇలా రోజూ చేస్తే చుండ్రు బాధ ఉండదు. శిరోజాలు కూడా ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ధనియాలు, సోంపు, తులసి ఆకులు, పసుపు, ఉసిరికాయ పొడిలను సమాన భాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీన్ని మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు 1 టేబుల్ స్పూన్ మోతాదులో సేవిస్తే చుండ్రు బాధ నుంచి తప్పించుకోవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపున 1 టీస్పూన్ ఉసిరికాయ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగినా చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు. కొత్తిమీర జ్యూస్లో చిటికెడు పసుపు కలిపి రోజూ రెండు పూటలా తాగితే చుండ్రు తగ్గుతుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…