కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు పనులు ఎలాంటి ఆంటకం లేకుండా జరుగుతుంటాయి. కానీ ప్రాసెస్ చేసిన ఆహారం, కాలుష్యం, అస్తవ్యస్త జీవనశైలి కారణంగా కాలేయంపై భారం పెరిగితే, దాని సామర్థ్యం క్రమంగా తగ్గే ప్రమాదం ఉంది. ఇటీవల జరిగిన ఒక ఆరోగ్య చర్చలో, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శివ్ కుమార్ సరీన్ లల్లన్టాప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాలేయాన్ని సహజంగా శుభ్రపరిచే కొన్ని ఆహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఖరీదైన సూపర్ఫుడ్స్ కాదు, మన వంటగదుల్లోనే దొరికే సాధారణ పదార్థాలే. రోజువారి ఆహారంలో వీటిని చేర్చితే, కాలేయం మరమ్మతులు చేసుకుని మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి.
ఆపిల్స్ సాధారణంగా పిల్లల లంచ్బాక్స్లకు పరిమితమైన పండ్లుగా భావిస్తాం. కానీ అవి కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆపిల్స్లో ఉండే పెక్టిన్ అనే సహజ ఫైబర్ విషపదార్థాలు, కొలెస్ట్రాల్ను బంధించి, అవి కాలేయానికి చేరకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల కాలేయంపై పని భారం తగ్గి, అది విశ్రాంతి తీసుకుని కోలుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఆపిల్స్లోని మాలిక్ ఆమ్లం పిత్తాశయ రాళ్లను మృదువుగా చేసి, పిత్త ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. కనుక ఆపిల్ పండ్లనను రోజూ తింటుంటే ఉపయోగం ఉంటుంది.
రిఫైండ్ కార్బొహైడ్రేట్లు కాలేయంపై అనవసర ఒత్తిడిని పెడతాయని, కానీ జొన్నలు, సజ్జలు, బార్లీ వంటి సంపూర్ణ ధాన్యాలు దానికి విరుద్ధంగా పనిచేస్తాయని డాక్టర్ సరీన్ చెప్పారు. ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి, రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా కాపాడతాయి, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. ఆయుర్వేదంలో తరచూ సూచించే బార్లీ నీరు, స్వల్ప మూత్రవిసర్జక లక్షణాలతో శరీరంలోని విషపదార్థాలను నెమ్మదిగా బయటకు పంపేందుకు తోడ్పడుతుంది. మిల్లెట్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయ కణాల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించి అదనపు రక్షణను అందిస్తాయి.
చూస్తే సాధారణంగా కనిపించే నల్ల శనగలకు కూడా కాలేయాన్ని బలపరిచే శక్తి ఉంది. వీటిలో ఉండే వృక్ష ప్రోటీన్, ద్రవీభవించే ఫైబర్, బీ విటమిన్లు కాలేయ ఎంజైమ్లు విషపదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. భారమైన మాంసాహారం లాగా సాచ్యురేటెడ్ ఫ్యాట్స్తో కాలేయాన్ని లోడ్ చేయకుండా, నల్ల శనగలు శుభ్రమైన మరమ్మత్తులకు దోహదపడతాయి. ఉదయం మొలకెత్తిన నల్ల శనగలను తినడం లేదా సాయంత్రం తేలికపాటి చాట్గా తీసుకోవడం కాలేయానికి రోజువారీ బలం ఇస్తుంది.
ప్లేట్లో రంగురంగుల కూరగాయలు ఎక్కువగా ఉండాలని డాక్టర్ సరీన్ సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి రంగులో వేర్వేరు యాంటీఆక్సిడెంట్లు దాగి ఉంటాయి. బీట్రూట్ పిత్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, క్యారెట్లు విషపదార్థాలు పేరుకుపోవడాన్ని అడ్డుకుంటాయి, పాలకూర కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది, క్యాప్సికం వాపును నియంత్రిస్తాయి. ఇవన్నీ కలసి కాలేయానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఒకే ఖరీదైన డిటాక్స్ జ్యూస్ కంటే, మూడు నాలుగు రంగుల కూరగాయలతో చేసిన సాధారణ కూరగాయల రసం ఎక్కువ ప్రభావవంతమని ఆయన తెలిపారు.
కాఫీపై తరచూ వాదనలు వినిపించినా, తాజా శాస్త్రీయ ఆధారాలు కాలేయానికి ఇది రక్షణగా పనిచేస్తుందని సూచిస్తున్నాయి. మితంగా కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి, సిర్రోసిస్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించి, కాలేయ ఎంజైమ్ల నియంత్రణకు తోడ్పడతాయి. అయితే చక్కెర, క్రీమ్ లేకుండా బ్లాక్ కాఫీ తాగడమే ఉత్తమమని డాక్టర్ సరీన్ సూచిస్తున్నారు. రోజువారీగా ఈ చిన్న అలవాట్లను పాటిస్తే కాలేయ కణాలను కాపాడుకోవచ్చని ఆయన సూచించారు.
గమనిక: ఈ సమాచాం కేవలం వైద్య విజ్ఞానం, అవగాహన కోసం మాత్రమే. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా సరే చికిత్స లేదా సలహా కోసం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…