Fenugreek Seeds : ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా సరైన జీవన విధానాన్ని అనుసరించాలి. నీళ్లు, నిద్ర, వ్యాయామం, ఆహారం వీటి అన్నిటిపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చాలామంది ఈ రోజుల్లో మధుమేహం, జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు ఉన్నవాళ్లు, ఈ విధంగా పాటిస్తే సమస్యల నుండి బయటపడవచ్చు.
మనం తరచూ వంటల్లో మెంతులని వాడుతూ ఉంటాము. మెంతులు వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో. మెంతులని ఈ విధంగా తినడం వలన చక్కటి లాభాలని మీరు పొందవచ్చు. ఆరోగ్యాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మొదట మెంతులని కడిగేసి, నీళ్లలో నానబెట్టండి. మెంతుల్ని నానబెట్టడం వలన చేదు తగ్గుతుంది. తీసుకోవడానికి సులభంగా ఉంటుంది. లేదంటే నీళ్ళల్లో ఉడకబెట్టుకుని కూడా తీసుకోవచ్చు.
రాత్రి పూట రెండు గ్లాసుల నీళ్లలో, రెండు టేబుల్ స్పూన్ల మెంతుల్ని నాన పెట్టుకోండి. లేదంటే వేడి నీళ్లతో అయినా నానబెట్టుకోవచ్చు. అయితే, ఉదయాన్నే మీరు ఈ మెంతులని తీసుకోవడం వలన అనేక లాభాలని పొందవచ్చు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు మెంతులను తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
కిడ్నీ ఆరోగ్యానికి కూడా మెంతులు ఎంతో మేలు చేస్తాయి. మూత్రపిండాల పనితీరు సక్రమంగా నిర్వహించడానికి, కిడ్నీ స్టోన్ బయటపడడానికి మెంతులు బాగా ఉపయోగపడతాయి. అందమైన చర్మం కోసం, బరువుని తగ్గించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా మెంతులు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా. ఈ విధంగా మీరు మెంతుల్ని కనుక తీసుకున్నట్లయితే, అనేక సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…