Yellow Teeth : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యకరమైన పద్ధతుల కోసమే చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన నష్టాలు అయితే తప్పవు. ఆరోగ్యం విషయంలో, ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించడం అవసరం. ఇదిలా ఉంటే, ఈ రోజుల్లో చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. పళ్ళు నల్లగా మారిపోవడం, పళ్ళు ఊడిపోవడం ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయి. దాంతో, డెంటిస్టులు దగ్గరికి వెళ్లి, క్యూ కడుతున్నారు.
కొంతమందిలో చూసినట్లయితే, పళ్ళు పచ్చగా మారిపోతూ ఉంటాయి. తెల్లని పళ్ళు పసుపుగా మారిపోతే, చూడడానికి అసలు బాగోదు. పైగా, నవ్వినప్పుడు అసలు బాగా కనపడదు. పళ్ళని తెల్లగా మార్చుకోవాలి అంటే, కొన్ని ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇలాంటి చిన్న విషయాలకి డెంటిస్ట్ లని సంప్రదించాల్సిన పనిలేదు. ఇంటి చిట్కాలతో, పసుపుగా ఉన్న పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు.
మరి ఎలా పసుపుపళ్లని తెల్లగా మార్చుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రెండే నిమిషాల్లో, మనం పసుపు పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు. అది ఎలా అంటే, దీని కోసం ముందు అల్లం తీసుకోండి. అల్లం చెక్కు తీసేసి ముక్కలు కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ముక్కని తీసుకుని తురుముకోండి. ఆ తురుములో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి.
ఒక స్పూన్ వరకు మీరు ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. నిమ్మకాయ చెక్కని కూడా కొద్దిగా తురుముకోండి. ఆ తురుమును కూడా ఇందులో మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో దీన్ని బాగా కలుపుకోండి. టూత్ బ్రష్ ని తీసుకుని, టూత్ బ్రష్ మీద ఈ పేస్ట్ ని పెట్టి, పళ్ళని తోమాలి. రెండు, మూడు నిమిషాల పాటు దీంతో పళ్ళని తోమితే, పచ్చగా మారిన పళ్ళు తెల్లగా వచ్చేస్తాయి.
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…
టీ20 ప్రపంచకప్ 2026లోనే కాదు, అంతకు ముందు కూడా భారత జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయాల బాటలో నడిపిస్తూ…