Mother And Child : తల్లి కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. దీన్ని అనేక మంది మహిళలు అదృష్టంగా కూడా భావిస్తారు. ఇక తమ కల నెరవేరి నిజంగా గర్భం దాల్చితే ఆ ఆనందానికి హద్దులు ఉండవు. ఈ క్రమంలోనే గర్భంతో ఉన్న మహిళలు పుట్టబోయే తమ బిడ్డ ఆరోగ్యం పట్ల అమితమైన శ్రద్ధ వహిస్తారు. అయితే గర్భంతో ఉన్నప్పుడే కాదు, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, వారు పాలు మరిచేంత వరకు తల్లులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బిడ్డ పుట్టిన తరువాత తల్లులు తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన వాటిలో తల్లిపాలు కూడా ఒకటి. ఈ విషయంలో తల్లులతోపాటు తండ్రులు కూడా వైద్యుల సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. డాక్టర్ సూచనల మేరకు తల్లిపాలను క్రమం తప్పకుండా అందించాలి. గర్భంతో ఉన్నప్పుడు ఎలాగైతే విటమిన్లు, మినరల్ ట్యాబ్లెట్లు తీసుకుంటారో అదే విధంగా బిడ్డ జన్మించిన తరువాత కూడా కొనసాగించాలి. డాక్టర్ చెప్పేంత వరకు లేదా బిడ్డ పాలు మరిచేంత వరకు ఈ ట్యాబ్లెట్లను తీసుకోవడం మానకూడదు. బిడ్డ జన్మించిన తరువాత సాధారణంగా తల్లులు ఎక్కువ ఒత్తిడి, అలసటకు లోనవుతుంటారు. ఇలాంటి సమయంలో ఇతరుల సహాయం తీసుకోవాలి.
డెలివరీ అనంతరం తల్లి ఎల్లప్పుడూ బిడ్డతో ఉంటుంది. ఈ సమయంలో టెన్షన్, ఆందోళనకు గురి చేసే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. వీటిని విడుదల చేసే గ్రంథులు కిడ్నీలపై ఉంటాయి. ఇవి కార్టిసాల్ అనే హార్మోన్ను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో తల్లుల్లో సహజంగానే తమ బిడ్డ పట్ల ఆందోళన ఏర్పడుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం లేదా ఇతరుల సహాయం తీసుకుంటే దీని నుంచి బయట పడవచ్చు. గర్భధారణ అనంతరం బిడ్డ డెలివరీ అయ్యే వరకు తీసుకున్న పౌష్టికాహారాన్ని బిడ్డ జన్మించిన అనంతరం కూడా కొనసాగించాలి. ఎందుకంటే పాలిచ్చే తల్లుల ద్వారా ఆ పౌష్టికాహారంలోని పోషకాలు బిడ్డకు లభిస్తాయి. కాబట్టి బిడ్డ పాలు మరిచేంత వరకు పౌష్టికాహారం తీసుకోవడం మానకూడదు.
డెలివరీ అనంతరం బిడ్డ సంరక్షణ సమయంలో ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే డిప్రెషన్కు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైతే మానసిక వైద్యుల వద్దకు వెళ్లాలి. దీంతో సమస్యను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…