Pasaru : చాలామంది, నోట్లో నుండి ఉదయాన్నే పసరు వస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పసర్ల సమస్య తగ్గాలంటే, ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పసరుని తీయడానికి, చాలామంది ఉదయం పూట, బ్రష్ చేసేటప్పుడు నోట్లో వేలు పెట్టుకొని, బలవంతంగా తీస్తూ ఉంటారు. కానీ, ఇది అసలు మంచిది కాదు. ఇటువంటి అలవాటు ఉన్నట్లయితే, మానుకోవడం మంచిది. చాలామంది, ఈ రోజుల్లో సరైన జీవన విధానాన్ని అనుసరించట్లేదు.
మంచి ఆహారపు అలవాట్లు కూడా పాటించట్లేదు. రాత్రిళ్ళు చాలామంది, ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం వంటివి చేస్తున్నారు. కానీ, అలా చేయకూడదు. రాత్రిపూట పది, పదకొండు వరకు భోజనం చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. రాత్రి పూట ఏడూ, ఎనిమిది గంటలకి డిన్నర్ పూర్తి చేసేసుకోవాలి. రాత్రిపూట ఇలా ఆలస్యంగా చేయడం వలన సరిగ్గా తిన్నది అరగదు. దీంతో రాత్రంతా కూడా జూసెస్ ప్రొడ్యూస్ అవ్వడం, ఇబ్బంది కలగడం వంటివి జరిగి, ఉదయాన్నే పసర్లు రావడం వంటివి జరుగుతాయి.
రాత్రిపూట ఆరు, ఏడు గంటల లోపు భోజనం చేసేయడం మంచిది. ఉడికిన ఆహార పదార్థాలు తీసుకోండి. కానీ ఆయిల్ ఎక్కువ ఉన్నవి, బాగా మసాలాలు వంటివి తీసుకోవద్దు. నాచురల్ ఫుడ్స్ ని ఎక్కువ తీసుకుంటే, తిన్నది బాగా జీర్ణం అవుతుంది. నానబెట్టిన గింజలు వంటివి తీసుకుంటే మంచిది. బాదంపప్పు, జీడిపప్పు ఇలాంటివి తీసుకోవచ్చు. నాలుగు రకాల పప్పులు నానబెట్టుకుని, రాత్రి తీసుకుంటే మంచిది.
డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా తీసుకోవచ్చు. పండ్లు కూడా మీరు తీసుకోవచ్చు. స్లోగా నములుతూ వీటన్నిటిని తీసుకోవడం మంచిది. తినే ఆహారం సరిగ్గా జీర్ణము అవ్వకపోవడం, ఆహారం కారణంగా ఇబ్బంది ఉండడం వలన ఈ సమస్య వస్తుంది. కాబట్టి, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి కనుక, సాయంత్రం 6 లేదా 7 గంటలకి డిన్నర్ తినేసేయండి. అప్పుడు ఇటువంటి బాధలు ఏమి కూడా ఉండవు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…