Tea : చాలామందికి టీ అంటే ఎంతో ఇష్టం. ప్రతి రోజు టీ ని తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా టీ ని ఇష్టపడుతూ ఉంటారా..? ఎక్కువగా టీ తాగుతున్నారా..? అయితే, కచ్చితంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే లేవగానే చాలామంది వాళ్ళ రోజుని టీతో మొదలు పెడుతూ ఉంటారు. ఏదైనా చిన్నపాటి ఒత్తిడి వున్నా, ఎక్కువగా టీ తాగేస్తుంటారు. నిద్ర పట్టకపోయినా టీ తాగేస్తుంటారు. ఎవరైనా వచ్చినా టీ తాగేస్తుంటారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగేస్తుంటారు.
కానీ, నిజానికి టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన చాలా రకాల సమస్యలు వస్తాయి. టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీ శరీరంలో పోషకాలని నాశనం చేస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు కాఫీ, టీ కి పూర్తిగా దూరంగా ఉండాలి. టీ లో కెఫిన్ తక్కువగా, కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. టీ లో ఉండే కెఫిన్ శరీరానికి కొంచెం మేలు చేస్తుంది. కానీ, అధికంగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి.
అలసట, గుండె వేగం పెరిగిపోవడం, నిద్రలేమి సమస్యలు కలగవచ్చు. ఎక్కువ కాఫీ, టీ తాగడం వలన పరధ్యానం లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మానసికంగా కూడా వివిధ సమస్యలు రావచ్చు. ఎక్కువగా టీ తాగడం వలన ఎముకల సమస్యలు కూడా కలుగవచ్చు. ఎముకలు నొప్పులు, ఎముకలు అరిగిపోవడం వంటివి కలుగవచ్చు. ఐదు కప్పుల కంటే ఎక్కువ టీ తాగే వాళ్ళలో, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 50 శాతం ఉందని పరిశోధన చెప్తోంది.
ఐస్ టీ ఎక్కువగా తాగితే, కిడ్నీ సమస్యలు వస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లు చేరుకోవడం వంటివి కూడా కలగొచ్చు. ఖాళీ కడుపుతో టీ తాగితే, మలబద్ధకం సమస్య వస్తుంది. పొత్తికడుపు నొప్పి వంటివి కూడా కలగొచ్చు. గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ గా టీ తాగడం మంచిది కాదు. ఎక్కువ టీ తాగితే, డిహైడ్రేషన్ వంటివి కూడా కలుగుతాయి. కాబట్టి, మరీ ఎక్కువగా టీ ని తీసుకోవద్దు. లిమిట్ గానే తీసుకోవాలి. రెండు గ్లాసులు కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…