చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే వీటిని చాలా మంది స్నాక్స్ లాగా భావిస్తారు. కానీ ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చిలగడదుంపలను ప్రస్తుతం చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారు. వీటిని అధిక శాతం వరకు ప్రజలు తినడం లేదు. కానీ వీటిని సూపర్ ఫుడ్ అని డాక్టర్ శుభం వత్స్య తెలిపారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఫోర్టిస్ హాస్పిటల్లో ఆయన గ్యాస్ట్రో ఎంటరాలిజస్టు, హెపటాలజిస్టుగా సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో చిలగడదుంపలు అందించే ప్రయోజనాలను వివరించారు. వీటిని నిర్లక్ష్యం చేయకూడదని, మన ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు.
డాక్టర్ శుభం వత్స్య తెలిపిన ప్రకారం, చిలగడదుంపలను చాలా మంది తక్కువగా భావిస్తూ తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ ఇవి చలికాలం సీజన్లో లభించే అత్యుత్తమ ఆహారం అని ఆయన తెలిపారు. చిలగడ దుంపల్లో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల ఈ దుంపలను తింటే జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. చిలగడదుంపలను తినడం వల్ల మన శరీరం షార్ట్-చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు అనే సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి జీర్ణాశయ పొరను రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. అలాగే సంక్లిష్టమైన పిండి పదార్థాలు, ఫైబర్ కారణంగా చిలగడదుంపలను తిన్న అనంతరం పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఎక్కువ సమయం పాటు ఉన్నా కూడా పొట్ట నిండుగానే ఉన్నట్లు అనిపిస్తుంది. దీని వల్ల శరీరానికి నిరంతరం శక్తి లభించి ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటారని ఆయన తెలిపారు. ఇక జీర్ణక్రియను మెరుగు పరిచేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, గుండెను రక్షించేందుకు కూడా చిలగడదుంపలు సహాయం చేస్తాయని చెప్పారు.
చిలగడదుంపల్లో రెసిస్టెంట్ స్టార్చ్ అని పిలవబడే ప్రత్యేకమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెరిగేలా చేస్తాయి. దీని వల్ల భోజనం అనంతరం షుగర్ లెవల్స్ 20 నుంచి 30 శాతం మేర తగ్గుతాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీని వల్ల షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఇక ఈ దుంపల్లో బీటా కెరోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మార్పు చెందుతుంది. విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు రేచీకటిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. దీంతో చిన్నారుల్లో కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయని డాక్టర్ శుభం వత్స్య తెలిపారు. ఈ దుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలకు మరమ్మత్తులను నిర్వహిస్తాయి. దీంతో చర్మ ఆరోగ్యం సైతం మెరుగు పడుతుందని అన్నారు.
చిలగడదుంపల్లో మాంగనీస్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు కావల్సిన పోషకాలను ఈ దుంపలు అందిస్తాయి. న్యూట్రిషన్ సోర్స్ తెలిపిన ప్రకారం, మన శరీరం మాంగనీస్ను సొంతంగా తయారు చేసుకోలేదు. కనుక స్వల్ప మొత్తాల్లో ఇది మన శరీరానికి లభించేలా చూసుకోవాలి. దీని వల్ల శరీరంలో అనేక జీవక్రియలు సైతం సక్రమంగా నిర్వహించబడతాయి.
చిలగడదుంపలను 100 గ్రాముల మోతాదులో తింటే సుమారుగా 4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. దీని వల్ల చాలా సేపు ఉన్నా పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇతర ఆహార పదార్థాలను తినాలనే యావ తగ్గుతుంది. ముఖ్యంగా తీపి పదార్థాలు, నూనె ఆహారాలు, ఇతర జంక్ ఫుడ్ను తినకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో శరీరంలో అదనపు క్యాలరీలు, కొవ్వు చేరకుండా నిరోధించవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. ఇలా చిలగడదుంపలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని, వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్ శుభం వత్స్య తెలిపారు.
గమనిక: ఈ కథనం కేవలం సమాచారం, వైద్య విజ్ఞానంపై అవగాహన కోసం మాత్రమే. చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉన్నా లేదా సలహా కోసమైనా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…