Foods For Brain Health : మనలో చాలా మంది పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేహ్యాలను, పొడులను వారికి ఇస్తూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే ఇవి ఖర్చుతో కూడుకున్నవి. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీర ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో అదే విధంగా మనం తీసుకునే ఆహారం ద్వారా మన మెదడు కూడా చక్కగా పని చేస్తుందని, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మన మెదడు నరాల సముదాయం. మెదడులోని నరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, జ్ఞాపక శక్తి పెరగాలన్నా మన మెదడుకు మూడు ముఖ్యమైన పోషకాలు చాలా అవసరం. జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ… ఈ మూడు పోషకాలు మన మెదడుకు చక్కగా అందితేనే మన మెదడు చక్కగా పని చేస్తుంది.
శరీరంలో జింక్ లోపించడం వల్ల మెదడు పని తీరు తగ్గుతుంది. మెదడు కణాల పనితీరు దెబ్బతింటుంది. గర్భిణీ స్త్రీలు జింక్ ను తక్కువగా తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల మెదడు నరాలు చక్కగా పని చేస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం పాటు అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే మనం ఆలోచించినప్పుడు మెదడులో అనేక రకాల రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి మెదడు కణాల జీవితకాలాన్ని తగ్గిస్తాయి. మెదడు కణాలు త్వరగా నశించేలా చేస్తాయి. విటమిన్ ఇ ఈ రసాయనాల కారణంగా మెదడు కణాలు దెబ్బతిన్నకుండా యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని కూడా పని చేస్తుంది. కనుక ఈ మూడు పోషకాలు కలిగిన ఆహారాన్ని పిల్లలకు ఆహారంగా ఇవ్వడం వల్ల వారికి ఎంతో మేలు కలుగుతుంది. మనకు 7 నుండి 10 మిల్లీ గ్రాముల జింక్ అవసరమవుతుంది.
పొద్దు తిరుగుడు పప్పు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, జనపనార విత్తనాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే జింక్ లభిస్తుంది. అలాగే మన శరీరానికి 1 నుండి 1.6 మిల్లీ గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒకరోజుకు అవసరమవుతాయి. వాల్ నట్స్ లో, చేపలల్లో, అవిసె గింజలు,చియా విత్తనాలు వంటి ఆహారాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఒక రోజుకు మన శరీరానికి 15 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. హజల్ నట్స్, బాదం పప్పు, పొద్దు తిరుగుడు పప్పు వంటి వాటిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను పిల్లలకు తరుచుగా ఇవ్వాలి. అలాగే వారితో ప్రాణాయామం చేయించాలి. ఇలా చేయడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…