Beer : ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఎండలు మరింత ముదరనున్నాయి. ఈ క్రమంలో మండుతున్న ఎండలు, వేడితో జనాలు అల్లాడిపోతున్నారు. అందుకే కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఇక అత్యవసర స్థితి ఉంటే తప్ప ఎవరూ బయటికి రావడం లేదు. వచ్చినా చల్లని మార్గాల వైపు చూస్తున్నారు. అందుకనే చాలా మంది తమ శరీరాలను చల్లగా ఉంచుకోవడం కోసం శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ వంటివి తాగుతున్నారు. అయితే మద్యం ప్రియులు ఎండల్లో విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కా కన్నా బీర్ తాగేందుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఎందుకంటే చల్ల చల్లని బీర్ తాగితే శరీరం చల్లగా ఉంటుందని వారు అనుకుంటారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ? నిజంగానే బీర్ తాగితే శరీరం చల్లబడుతుందా ? వేసవిలో బీర్ తాగవచ్చా ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీర్ కూడా ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్లాగే ఉంటుంది. కాకపోతే అందులో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో చల్లని బీర్ను తాగితే అందులో ఉండే ఆల్కహాల్ వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. అంటే ఒంట్లో ఉన్న నీరు అంతా బయటకు పోతుంది. అయితే వేసవిలో సహజంగానే మన శరరీంలో ఉండే నీరు డీహైడ్రేషన్ వల్ల బయటకు వెళ్లిపోతుంది. దీంతో మనకు దాహం అవుతుంది. అదే ఈ కాలంలో ఇక బీర్ కాదు, ఏ ఇతర ఆల్కహాలిక్ డ్రింక్ తాగినా సరే.. డీహైడ్రేషన్ మరింత ఎక్కువవుతుంది. దీంతో మన శరీరంలో ఉండే నీరు ఇంకా త్వరగా బయటకు పోతుంది. అది మనకు అస్సలు మంచిది కాదు. కనుక వేసవిలో బీర్ కాదు, ఇతర ఏ ఆల్కహాలిక్ డ్రింక్ను తాగకుండా ఉండడమే బెటర్.
ఇక చాలా మంది చల్లని నీళ్లను తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది అనుకుంటారు. కానీ చల్లదనం కేవలం మన దాహం మాత్రమే తీరుస్తుంది. శరీరాన్ని చల్ల బరచదు. కానీ జీర్ణాశయంలో ఎలాంటి అలజడి లేకుండా చేస్తుంది. అయితే శరీరం చల్లబడాలంటే నీళ్లకు బదులుగా కొబ్బరి నీళ్లను తాగితే ఇంకా మంచిది. వేసవిలో మనకు వేడి ఎక్కువగా చేస్తుంది కనుక ఆ వేడి తగ్గాలంటే నీళ్లు సరిపోవు. కానీ కొబ్బరి నీళ్లను తాగితే వేడి ఇట్టే దిగిపోతుంది. కనుక ఈ సీజన్లో కొబ్బరి నీళ్లను తాగాల్సి ఉంటుంది. కాబట్టి శరీరంలో వేడి ఉన్నవారు రోజూ కొబ్బరి నీళ్లను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. దీంతోపాటు పుచ్చకాయలు, తర్బూజా వంటివి కూడా మేలు చేస్తాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…