Cardamom For Beauty : మన భారతీయుల వంట గదుల్లో ఉండే మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులు చక్కటి వాసనను, రుచిని కలిగి ఉంటాయి. దాదాపు మనం చేసే అన్ని రకాల తీపి వంటకాలు, మసాలా వంటకాల్లో ఈ యాలకులను వాడుతూ ఉంటాము. మనం చేసే వంటలకు మంచి వాసనను, రుచిని తీసుకురావడంలో యాలకులు చక్కటి పాత్ర పోషిస్తాయి. అలాగే యాలకులను తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా నోటి దుర్వాసనను తగ్గించడంలో ఇవి చక్కగా పని చేస్తాయి. అయితే మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా యాలకులు ఎంతో మేలు చేస్తాయి. యాలకులను వాడడం వల్ల మనం చక్కటి అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
అయితే యాలకులను ముఖ సౌందర్యం పెంచుకోవడానికి ఎలా వాడాలి.. వీటిని వాడడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 10 యాలకులను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో తేనె, పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు తగ్గుతాయి. అలాగే యాలకుల పొడిలో పెరుగు, శనగపిండి కలిపి ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గిపోతాయి. చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మంపై ఉండే మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం అందంగా తయారవుతుంది. అలాగే యాలకుల నీటిని వాడడం వల్ల కూడా మనం చక్కటి అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
దీని కోసం గిన్నెలో 5 నుండి 10 యాలకులు వేసి నీరు పోసి ఉడకబెట్టాలి. యాలకులు లేత రంగులోకి వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీళ్లు కొద్దిగా చల్లారిన తరువాత ఈ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ నీటిని టోనర్ గా కూడా వాడవచ్చు. అలాగే ఈ నీటిని వివిధ రకాల ఫేస్ ప్యాక్ లల్లో కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా యాలకులను వాడడం వల్ల మనం అందమైన, కాంతివంతమైన, మచ్చలు లేని చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…