Jowar Idli Recipe : చాలామంది, జొన్న పిండిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. జొన్న పిండి వలన పలు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా, మధుమేహం ఉన్నవాళ్లు, జొన్న పిండితో చేసిన ఇడ్లీలు తీసుకుంటే, ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఉదయం అల్పాహారం సమయంలో, జొన్న పిండి తో తయారు చేసుకున్న ఇడ్లీలు తీసుకోవడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే, మరీ మంచిది.
మరి ఈ జొన్న ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జొన్న పిండి ఇడ్లీలని తయారు చేసుకోవడానికి, ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు రవ్వ, ఒకటిన్నర కప్పు పెరుగు, కొత్తిమీర తరుగు, ఒక చెంచా జీడిపప్పు, కొంచెం వంట సోడా, రెండు చెంచాల నూనె, అర చెంచా ఆవాలు, అర చించా మినప్పప్పు, మూడు పచ్చిమిరప కాయలు, ఒక కరివేపాకు రెబ్బ, చిటికెడు ఇంగువ.
దీని కోసం ముందు ఒక గిన్నె లో రవ్వ, జొన్న పిండి, ఉప్పు, పెరుగు, నీళ్లు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిండిని అరగంట నుండి 40 నిమిషాల పాటు వదిలేయండి. ఒక చిన్న కడాయి పెట్టుకుని, నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందాక పెట్టుకున్న పిండి మిశ్రమంలో, ఈ తాలింపు వేసుకోవాలి.
పిండి గట్టిగా అనిపిస్తే, కొంచెం నీళ్లు పోసుకోండి. ఇప్పుడు కొంచెం వంట సోడా కూడా వేసుకుని, ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీలు లాగా ఈ పిండిని వేసుకోవాలి. ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడకపెట్టుకొని, బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా ఎంతో ఈజీగా, జొన్న ఇడ్లీలని తయారు చేసుకోవచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…