సాధారణంగా మనకు సూపర్ మార్కెట్లలో లభించని వస్తువు అంటూ ఉండదు. అన్ని రకాల వస్తువులతోపాటు ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు లభిస్తాయి. అయితే పండ్లు, కూరగాయలను మాత్రం ఎక్కడో తోటల నుంచి సూపర్ మార్కెట్లకు తరలించే సరికి కొన్ని రోజుల సమయం పడుతుంది. దీంతో అవి తాజాగా ఉండవు. పైగా అవి ఫ్రిజ్లో ఉన్నంత వరకు బాగానే ఉంటాయి. ఒక్కసారి వాటిని బయటకు తీశాక వెంటనే పాడవుతాయి. దీంతో వినియోగదారులకు నష్టం, పర్యావరణానికి హాని కలుగుతాయి. అయితే ఈ ఇబ్బందులను అధిగమించేందుకే ఆ సూపర్ మార్కెట్ వారు ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే..
కెనడాలోని మాంట్రియాల్లో 2017లో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐజీఏ ఎక్ట్రా ఫమిలె డుషెమిన్ అనే గ్రాసరీ స్టోర్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ సూపర్ మార్కెట్ పైభాగంలో యాజమాన్యం పంటలను పండించడం మొదలు పెట్టింది. వారు పైకప్పు మీద కొత్తిమీర, క్యారెట్లు, వంకాయలు, వెల్లుల్లి, టమాటాలు, పచ్చి మిరపకాయలు, పాలకూర వంటి కూరగాయలను పండించడం మొదలు పెట్టారు. ఇక తేనె కోసం ప్రత్యేక బాక్సులను కూడా ఏర్పాటు చేశారు.
దీంతో ఆ సూపర్ మార్కెట్పైన కూరగాయలు పండుతాయి. తేనె లభిస్తుంది. వాటిని కిందే ఉన్న సూపర్ మార్కెట్ లో విక్రయిస్తారు. దీంతో వినియోగదారులకు ఎప్పటికప్పుడు తాజాగా కూరగాయలు లభిస్తాయి. ఈ ఐడియా చాలా బాగా క్లిక్ అయింది. ఈ క్రమంలో ఆ సూపర్ మార్కెట్లో రద్దీ కూడా పెరిగింది.
ఇక వారు తమ సూపర్ మార్కెట్లో వృథాగా పోయే నీటిని రీసైకిల్ చేసి పంటలకు ఉపయోగిస్తారు. పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండిస్తారు. దీని వల్ల స్వచ్ఛమైన, సహజసిద్ధమైన కూరగాయలు వినియోగదారులకు లభిస్తాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ క్రమంలోనే ఆ సూపర్ మార్కెట్ ను చూసి కొందరు అలాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా వారి ఐడియా భలేగా ఉంది కదా..!
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…