Sara Tendulkar : ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి స్పందించిన వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూతురికి సంబంధించిన వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. సచిన్ కూతురు సారా తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. తనకు ట్విటర్ (ఎక్స్)లో ఎలాంటి అకౌంట్ లేదన్న సారా టెండూల్కర్.. తన పేరిట అసత్య ప్రచారం సాగుతోందని వాపోయింది. తన పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి డీప్ ఫేక్ ఫోటోలను షేర్ చేస్తున్నారని మండిపడింది. నకిలీ ఖాతాలపై.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఇటీవలి కాలంలో డీప్ ఫేక్ అంశం సీని ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.
టాలీవుడ్ నటి రష్మిక మందన్నాడీప్ఫేక్ వీడియోలు, ఫోటోలు సంచనలం అయ్యాయి. ఆ తర్వాత చాలామంది ఆ డీప్ఫేక్ వీడియోలకు బలయ్యారు. స్వయాన దేశ ప్రధాని నరేంద్రమోడీ కూడా డీప్ఫేక్ బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం బాలీవుడ్ నటి కాజల్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఇప్పడు తాజాగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ వీడియోలకు గురయినట్లు స్వయాన తనే ప్రకటించింది. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్మీడియాలో వైరల్గా మారాయి. అయితే వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా గిల్కు విషెస్ చెబుతున్నట్లుగా సారా టెండూల్కర్ పేరిట బ్లూటిక్ మార్క్ ఉన్న ట్విటర్ అకౌంట్ నుంచి కొన్ని పోస్టులు వచ్చాయి.
ఆ సమయంలో చాలా మంది నెటిజన్స్ సారా నిజమైన అకౌంట్ అని భావించి.. ఈ అంశమై మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తన పేరిట ఉన్న నకిలీ అకౌంట్ నుంచి జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సారా టెండూల్కర్ స్పందించింది. ఎక్స్లో తనకు అకౌంటే లేదని ఇన్స్టాగ్రామ్లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టిన సారా టెండూల్కర్.. తన పేరిట ఉన్న నకిలీ అకౌంట్ల మీద చర్యలు తీసుకోవాలని ఎక్స్ యాజమాన్యాన్ని కోరింది. మన బాధలు, సంతోషాలు అలాగే రోజువారీ కార్యక్రమాలను పంచుకునేందుకు సోషల్ మీడియా ఓ అద్భుతమైన వేదిక.
అయితే కొంతమంది ఈ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాలను దాచేస్తూ అభూత కల్పనలతో ఇంటర్నెట్ను నింపేస్తున్నారు. నా డీప్ ఫేక్ ఫోటోలు కూడా నా దృష్టికి వచ్చాయి. ఎక్స్లో నాపేరుతో నకిలీ ఖాతాలు తెరిచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజానికి నాకు ఎక్స్లో అకౌంటే లేదు. నా పేరుతో ఉన్న నకిలీ అకౌంట్లను ఎక్స్ వీలైనంత త్వరగా గుర్తించి తొలగిస్తుందని ఆశిస్తున్నా..వాస్తవాలను పంచుకోవడానికే సోషల్ మీడియాను ఉపయోగిద్దాం” అంటూ పోస్ట్ షేర్ చేసింది సారా టెండూల్కర్.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…