Roshan Kanakala : తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయినటువంటి సుమ కనకాల ఇప్పుడు బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి అనేక మంది బుల్లి తెర అభిమానుల హృదయాలను కూడా దోచుకుంది. కెరీర్ సజావుగా సాగుతున్న సమయం లోనే తెలుగు నటుడు అయినటువంటి రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు జన్మించారు. కొడుకు రోషన్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు.
క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ చిత్రాలతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న రవికాంత్ పేరేపు ‘బబుల్ గమ్’ చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో రోషన్ కథానాయకుడిగా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు.ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడవిశేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారు గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో రోషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రోల్స్ పై ఆయన స్పందన అందరిని ఆశ్చర్యపరిచింది.
మస్త్ కర్రిగా ఉన్నాడు, వీడు హీరో ఏంటి” అని తన గురించి చాలా మాట్లాడుకోవడం విన్నానని, చదివానని రోషన్ కనకాల అన్నాడు. కర్రగా ఉన్నానా?, తెల్లగా ఉన్నానా అనేది మ్యాటర్ కాదని ఇక్కడ టాలెంట్ ముఖ్యం అని చెప్పాడు రోషన్. వీడేంటి మస్త్ కర్రగా ఉన్నాడు వీడు హీరో ఏంటి? హీరో మొఖం కాదు, బొక్క వేస్ట్ హీరో మెటీరియల్ కాదు అన్నారు. నేను ఇలానే పుట్టాను. ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు, తెలుపు, అందం కాదు బ్రదర్ సక్సెస్ ని డిసైడ్ చేసేది. ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్, డిసిప్లెయిన్ మాత్రమే నిర్ణయిస్తుంది. మన అందరి జాతకంలో ఏం రాసి పెట్టిందో ఎవరికీ తెలియదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా, ఔకాద్ అయినా, ఒక రోజు వస్తది, వద్దనుకున్నా వినబడతా, చేవులు మూసుకున్నా వినబడతా. డిసెంబర్ 29న రాసిపెట్టుకోండి, థియేటర్కి వచ్చేయండి. ఆది గాడి లవ్ని చూడండి, ఆదిగాడి ఫైట్ ఫర్ రెస్పెక్ట్ ని చూడండి` అంటూ రోషన్ చాలా వీరోచితంగా మాట్లాడాడు. ఆ మాటలకి సుమ కన్నీళ్లు పెట్టుకుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…