నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో జరిగిన చిన్నపాటి సంభాషణలోనే తన పెళ్లి తేదీపై జరుగుతున్న చర్చలకు పరోక్షంగా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఎయిర్పోర్ట్లో రష్మికను చూసిన ఫోటోగ్రాఫర్లు, ఫిబ్రవరి 26న పెళ్లికి శుభాకాంక్షలు.. అంటూ ఆమెను అభినందించారు. దీనిని ఆమె ఖండించకుండా, చిరునవ్వుతో తల ఊపడం గమనార్హం. ఈ స్పందనను అభిమానులు, మీడియా వర్గాలు ఆమె పెళ్లి తేదీకి మౌన సమ్మతిగా భావిస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం అక్టోబర్లో వీరి నిశ్చితార్థం జరిగినట్లు మీడియాలో వచ్చింది. కానీ వారు ఈ విషయాన్ని ధ్రువీకరించలేవు. అయితే అప్పటి నుంచి వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారు.
పెళ్లి ఏర్పాట్ల మధ్య కూడా రష్మిక తన సినీ బాధ్యతలను విస్మరించలేదు. వరుస షూటింగ్లతో బిజీగా కొనసాగుతూ, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్కు పూర్తి న్యాయం చేస్తోంది. రష్మిక – విజయ్ జంట గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ మరోసారి కలిసి రణబాలి అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కాగా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. అయితే వీరి పెళ్లి వేడుకలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…