Rashmi Gautam : జబర్ధస్త్ షోతో పుల్ పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్.హీరోయిన్ కావాలని తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ భామ కెరియర్ బిగినింగ్ లో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. క్రేజ్ కొట్టేసింది. ఇక హీరోయిన్ ఫ్రెండుగా… పలు సినిమాల్లో నటించి అలరించింది. అయితే అంతగా ఛాన్సులు రష్మీని పలకరించకపోవడంతో… మళ్లీ యాంకరింగ్ వైపు మళ్లింది. అలా బుల్లితెరపై అప్పటికే జనాలను ఎంటర్ టైన్ చేస్తున్న జబర్దస్త్ షోలో అనసూయకు పోటీగా దిగింది. ఇక అక్కడి నుంచి రష్మి ఫేట్ మారిపోయిందనే చెప్పాలి.
ఇప్పుడు జబర్ధస్త్తో పాటు పలు షోస్తో తెగ సందడి చేస్తుంది రష్మీ.హాట్ హాట్ అందాలతో అదరగొట్టడం వలన మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మీ సుడిగాలి సుధీర్ తో అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నడిపింది. ఇది ఫుల్ గా వర్క్ అవుట్ అవ్వడంతో మరితం పాపులర్ అయింది. వీరిద్దరి డాన్సులు, పెళ్లి స్కిట్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. సుధీర్-రష్మీ నిజ జీవితంలో కూడా లవర్స్ అని జనాలు గట్టిగా నమ్మేంతగా వారి లవ్ ట్రాక్ నడిచింది. వారు పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారాలు సాగాయి. కాని ప్రతిసారి వాటిని రష్మీ, సుధీర్ ఖండిస్తూనే వచ్చారు. ఇక రష్మీ పెళ్లి వార్తలు నిత్యం నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటాయి.
ఆ మధ్య ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకారం చెప్పుకున్నారని, త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని అన్నారు. కాని అది పుకారుగానే మిగిలిపోయింది. ఇక రష్మీ పెళ్లి గురించి పదే పదే ప్రశ్నలు వెల్లువెత్తుండగా, ఈ సారి పక్కా క్లారిటీ ఇవ్వనుందట. తాజాగా “రష్మీ పెళ్లి పార్టీ” పేరుతో ఒక ఈవెంట్ చేస్తున్నారు.అయితే ఈ ఈవెంట్ లో రష్మి తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతుందని, తనకి కాబోయే భర్తకు సంబంధించిన విషయం ఈ షోలో బయట పెట్టబోతున్నట్టు అర్ధమవుతుంది. అయితే నిజంగానే రష్మీ తనకి కాబోయే వ్యక్తి గురించి చెబుతుందా, లేకుంటే షో హైప్ కోసం ఇలా ట్విస్ట్ ఇచ్చారా అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…