కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినీ ఇండస్ట్రీల నుంచి నటీనటులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సందడి చేసిన నటీనటుల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా 2024లో రిలీజ్ అయిన దక్షిణ భారత చిత్రాలకు గాను పలు విభాగాల్లో అవార్డులను అందజేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాకు ఆయనకు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. అయితే ఈ వేడుకలపై హర్షం వ్యక్తం చేసిన నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఒక్క విషయంలో మాత్రం నిరాశ చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. తొలిసారిగా అవార్డును అందుకున్న వారికి వేదికపై మాట్లాడేందుకు కనీస సమయం కేటాయించనందుకు ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించినందుకు, పలు విభాగాల్లో అవార్డులను అందజేసినందుకు సంతోషంగా ఉందని నిహారిక తన పోస్టులో పేర్కొన్నారు. కానీ మొదటిసారిగా అవార్డులను తీసుకున్న విజేతలను ఈ కార్యక్రమంలో సరిగ్గా గౌరవించలేదని విచారం వ్యక్తం చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ ఒకే వేదికపై సందడి చేయడం ఆనందంగా ఉందని, కానీ తొలిసారి అవార్డు పొందిన తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన వ్యక్తులకు వేదికపై మాట్లాడే అవకాశం లభించకపోవడం దురదృష్టకరమన్నారు. వారికి అలాంటి ప్రతిష్టాత్మక వేదికపై తమ గొంతుకను వినిపించే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఒక నటుడు తన ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెడితే అలాంటి వారికి ఇలాంటి వేదికలు ప్రేరణగా నిలుస్తాయన్నారు. వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు గొప్ప వేదికలుగా మారుతాయని అన్నారు.
మొదటిసారి అవార్డులను పొందిన వారి మాటలను వింటే వారికి సినిమా అంటే ఎందుకు అంత ఇష్టమో అర్థమవుతుందని నిహారిక స్పష్టం చేశారు. ఇలాంటి భారీ అవార్డు కార్యక్రమాలలో అందరికీ తగిన సమయం కేటాయించడం సమస్యగానే ఉంటుందని అంగీకరించిన నిహారిక, తొలిసారిగా స్టేజీ మీద అవార్డు పొందిన వారికి కనీసం ఒక అవకాశం ఇస్తే బాగుండేదని అన్నారు. కనీసం వారికి ఒక నిమిషం అయినా కేటాయించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అది వారికి జీవితాంతం ఒక గొప్ప జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. అయితే నిహారిక పోస్టుపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆమె వ్యాఖ్యల్లో నిజం ఉందని, ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…