Mahesh Babu T Shirt Price : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఇటీవలి కాలంలో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు కారం అనే చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు చాలా తక్కువగా బయట కనిపిస్తుంటారు. ఆయన రీసెంట్గా యానిమల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో కనిపించి సందడి చేశారు. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ భారీ ఎత్తున నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ ఎంతో సింపుల్ గా లైట్ బ్లూ కలర్ టీ షర్ట్, బ్లూ జిన్స్ తో వచ్చారు. తాజాగా మహేష్ బాబు ధరించిన టీషర్ట్ ధర నెట్టింట వైరల్ అవుతుంది. ఒక ప్లెయిన్ టీషర్ట్ , జీన్స్ వేసుకొని వచ్చి అందరిని డామినేట్ చేశాడు మహేష్ బాబు. అయితే మహేష్ వేసుకున్న టీషర్ట్ సింపుల్ గానే ఉంది కానీ దాని ధర మాత్రం దిమ్మతిరిగే రేంజ్ లో ఉంది. గివేంచి బ్రాండ్ కు చెందిన ఈ టీషర్ట్ చాలా కాస్ట్ గురూ.. దీని ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ టీషర్ట్ ధర అక్షరాలా రూ. 47వేలు. చూడటానికి సింపుల్ గా ఉంది కానీ ధర మాత్రం మైండ్ బ్లాక్ చేస్తుంది అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
మహేష్ బాబు టీషర్ట్ ధర విన్న తర్వాత అందరు కూడా ..మరి సూపర్ స్టార్ మహేష్ బాబా? మజాకా అంటూ అభిమానులు అంటున్నారు. సాధారణంగా ఎక్కువ మంది సెలబ్స్ స్పెషల్ గా డిజనర్ సెట్ చేసిన డ్రెస్సులు, చీరలు ధరించి వెళ్తుంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం దీనికి పూర్తి విరుద్దం. మూవీ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్స్ కి చాలా సింపుల్ గా వెళ్తుంటారు. ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకున్నా చాలా ట్రెండీగా కనిపిస్తారని అభిమానులు అంటుంటారు. యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్కి కూడా అలానే వచ్చిన ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు.
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…