Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం పెద్దగా సక్సెస్ లేకపోయిన మనోడు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వైవిధ్యమైన సినిమాలతో దూసుకు పోతున్నారు. ఈ ఏడాది మొత్తం మూడు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా వీటిలో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మాత్రం ఓ మోస్తరుగా అలరించింది. కిరణ్ అబ్బవరం చివరగా రూల్స్ రంజన్ అంటూ వచ్చాడు. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. అలా కిరణ్ అబ్బవరంకు ఇప్పుడు కాస్త బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. రానున్న రోజుల్లో కిరణ్ అబ్బవరం నుంచి ఓ పాన్ ఇండియా మూవీ వస్తుందనే టాక్ వినిపించింది.
ఇదిలా ఉంటే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. అషు రెడ్డిని హోస్టుగా పెట్టి కొత్త టాక్ షో ‘దావత్’ ని మొదలు పెట్టింది. ఈ టాక్ షోకి తొలి గెస్ట్గా యువ హీరో కిరణ్ అబ్బవరంని గెస్ట్ గా వచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కిరణ్ కి సంబంధించిన అనేక విషయాలను ఆడియన్స్ కి తెలియజేశారు అషు రెడ్డి. కాగా కిరణ్ అబ్బవరం తన నటించిన సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. బడా స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాదిరిగానే తాను చేస్తున్నాడని టాక్ నడిచింది. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరంకి దాని గురించి అషూ ప్రశ్న వేసింది.
దానిపై స్పందించిన కిరణ్ అబ్బవరం ముందు ఎంతో కొంత తీసుకోవడం కంటే.. సినిమా అంతా అయ్యాక.. నిర్మాతకు పెట్టింది వచ్చాక.. లాభాలు వస్తే తీసుకుందామనుకుంటాను.. అందులో షేర్ తీసుకుంటాను.. ఒక వేళ సినిమా పోతే.. నిర్మాతకు ఏం రాకపోతే.. నేను కూడా ఏమీ తీసుకోను అంటూ ఎంతో నిజాయితీగా చెప్పుకొచ్చాడు. మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే చిత్రాలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు అని చేశారా? అంటూ అషూ అడిగింది. అవును అంటూ సమాధానం ఇచ్చాడు. ఒక వేళ మీరే నిర్మాతలు అయి ఉంటే ఆ సినిమాలు నిర్మించేవారా? అని మళ్లీ అడిగింది అషూ. నిర్మాతగా అయితే నిర్మించేవాడ్ని కాదని అంటాడు. ఇలా కిరణ్ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…