Jyothsna Tirunagari : రామ్ గోపాల్ వర్మ సంచలనాలకి మారు పేరు.వర్మ పుట్టిన తర్వాత వివాదం పుట్టిందా అనేంత తన సినిమాలతో పాటు తన ఆటిట్యూట్తో ఎపుడు వార్తల్లో ఉంటారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే వర్మ తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడును నెగిటివ్గా చూపిస్తూ వ్యూహం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సెన్సార్ కాకుండా లోకేష్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినా.. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేసారు. గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలను టార్గెట్ చేసిన ఈయన.. ఇపుడు మరోసారి వ్యూహం అనే సినిమాతో సంచలనం సృష్టించబోతున్నాడు.
నిజానికి నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ కమిటీ అభ్యంతరం చెప్పడంతో వాయిదా పడింది. తిరిగి బెంగళూరులోని రివైజ్ కమిటీ సిఫార్సు మేరకు డిసెంబర్ 29న థియేటర్లో విడుదల కానుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా చిత్ర దర్వకుడు వర్మపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నతిరునగరి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను అవమానిస్తున్నారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జ్యోత్స్న ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని కలిసి తన ఫిర్యాదు పత్రాన్ని జ్యోత్స్న అందజేశారు. వర్మ సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు కూడా పెడుతున్నారని కమిషనర్ దృష్టికి జ్యోత్స్న తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ సమర్పిస్తామని కూడా చెప్పారు. నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని పేటీఎం బ్యాచ్ల మాదిరిగా మీరు కూడా తయారైతే ఊరుకునే ప్రసక్తే లేదు. మాకు తెలంగాణ పోలీసుల మీద చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా రాంగోపాల్ వర్మ మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారని మేం భావిస్తున్నాం అని జ్యోత్స్న అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…