Allu Arjun : టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ ప్రమోషన్లో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించగా, దీనికి వేలాది మంది తరలి వచ్చారు.
బన్నీ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం పోలీసులకి, నిర్వాహకులకి తలకు మించిన భారంగా మారింది. ఈ ఈవెంట్లో తొక్కిసలాట జరగడంతో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య అల్లు అర్జున్ తన అభిమానులతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్కన్వెన్షన్ సెంటర్లో ఫ్యాన్స్తో ఫోటో సెషన్ నిర్వహించారు. అయితే అభిమానులు భారీగా పోటెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఫ్యాన్ మీట్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందంటూ నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎన్ కన్వెన్షన్ గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులను చెదరగొట్టిన పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. పలువురు అభిమానులు గాయపడ్డారు.
దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. ఫ్యాన్స్ మీట్ ఈవెంట్లో పలువురు అభిమానులకు గాయాలయ్యాయని తెలిసింది. నా వ్యక్తిగత టీమ్ దానిపై మానిటరింగ్ చేస్తుంది. అందుకు సంబంధించిన ప్రతి విషయం నాకు చేరవేస్తున్నారు. వారిని బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాదని నా వైపునుంచి హామీ ఇస్తున్నా. మీ ప్రేమ, అభిమానాలు నాకు పెద్ద అసెట్. వారి ప్రేమని ఎప్పుడూ లైట్ తీసుకోను` అని తెలిపారు.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…