Akka OTT : మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి సినిమాలో వైవిధ్యమైన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. నేను శైలజ చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆమె చేసిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోనూ అనువాదం అయ్యాయి. గ్లామరస్ పాత్రలోనే కాకుండా డీగ్లామరస్ పాత్రల్లో కూడా అలరించి మెప్పించగల సత్తా ఉన్న ఈమె… వరుసగా చిత్రాలు చేస్తూ అదరగొడుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం చాలా మంది ముద్దుగుమ్మలు ఓటీటీలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో కీర్తి సురేష్ కూడా తొలిసారి ఓ వెబ్సిరీస్ లో నటించబోతోంది. నటి రాధికా ఆప్టేతో కలిసి ఈ వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ సిరీస్ కు మేకర్స్ ‘అక్క’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్, రాధిక ఆప్టేలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న ఈ వెబ్ సిరీస్ కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా… ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రా ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ది రైల్వే మేన్, మండలా మర్డర్స్ వంటి వెబ్ సిరీస్ లు తెరకెక్కించిన ఈ వైఆర్ఎఫ్ నిర్మాణ సంస్థనే ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్, రాధిక ఆప్టేలు ముఖాముఖిగా ఇందులో తలపడబోతున్నారని, ఇదో రివెంజ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పనులు అన్నీ పూర్తి అయ్యాయని.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అయితే షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఈ విషయాలను బయటకు రానివ్వకూడదని మేకర్స్ భావించినట్టు సమాచారం. ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తూ… వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…