Renu Desai : రేణూ దేశాయ్.. ఆమె ఒక నటిగా, మల్టీ టాలెంట్ ఉన్న మహిళగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రేణ దేశాయ్ సినిమాలకి దూరమైన కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకి ఎప్పటికి దగ్గరగానే ఉంటుంది. అయితే రేణూ దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీఎంట్రీ ఇవ్వగా, ఇందులో హేమలత లవణం అనే పాత్రలో నటించి మెప్పించింది. సినిమా అంత హిట్ కాకపోయిన ఆమె పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే డిసెంబర్ 4న రేణూ దేశాయ్ బర్త్ డే కాగా, ఆమెకి అదిరిపోయే గిఫ్ట్ అందించాడు అకీరా నందన్. అకీరా తన తల్లి మాదిరిగానే మల్టీ టాలెంటెడ్. ఆటల్లో మేటి.. చదువుల్లో ఫష్ట్.. ఎక్స్ట్రా యాక్టివిటీస్లోనూ ముందుంటాడు. పియానో వాయిస్తాడు.. బాస్కెట్ బాల్ ఆడేస్తుంటాడు. ఇప్పుడు విదేశాల్లో సినిమా, మ్యూజిక్ అంటూ కోర్సులు నేర్చుకుంటాడు.
ఇప్పుడు అకిరా నందన్ ఎడిటింగ్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. తల్లి బర్త్ డే సందర్భంగా ఓ వీడియోని ఎడిట్ చేసి గిఫ్ట్గా ఇచ్చాడు. జానీ సినిమాలోని సీన్లను, షాట్స్ను ఎడిట్ చేయగా, అందులో రేణూ దేశాయ్ కనిపించే షాట్లను ఎక్కువ పెట్టి.. పవన్ కళ్యాణ్తో కనిపించే షాట్లను రెండు మూడు యాడ్ చేశాడు. ఇక ఈ ఎడిట్కు సప్త సాగరాలు దాటి మూవీలోని సాంగ్ను బ్యాక్ గ్రౌండ్లో పెట్టేశాడు. తనయుడు ఇచ్చిన గిఫ్ట్ని రేణూ దేశాయ్ చాలా లేట్గా షేర్ చేసింది. తాజాగా నా కొడుకు ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఇది అంటూ రేణూ మురిసిపోతూ ఓ వీడియో షేర్ చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది.
అమ్మ కోసం అకిరా చేసిన ఈ వీడియో మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అమ్మానాన్నలు అంటే అకిరాకు ఎంత ప్రేమో ఈ వీడియోను చూస్తేనే అర్థం అవుతోంది. ఈ వీడియో చాలా బాగా ఎడిట్ చేశావంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీడియో అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సాధారణంగా అకీరా అప్పుడప్పుడు తన తల్లికి ఏదో రకంగా సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటాడు.. ఆ మధ్య రేణూ దేశాయ్కి ఇష్టమైన పాటను పియానో ద్వారా వినిపించాడు. అది విని రేణూ చాలా మురిసిపోయింది. అయితే పవన్ నుండి విడిపోయాక మరో పెళ్లి చేసుకోని రేణూ దేశాయ్ పిల్లలే తన ప్రాణంగా జీవిస్తుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…