ఆధ్యాత్మికం

Yama Dharma Raju : మ‌నిషి చ‌నిపోయాక అత‌ని ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా..?

Yama Dharma Raju : మ‌నిషి చ‌నిపోయాక ఏం జ‌రుగుతుంది..? అత‌ని శ‌రీరాన్న‌యితే ఖ‌న‌నం చేస్తారు. మ‌రి ఆత్మ సంగ‌తి..? అది ఎక్క‌డికి వెళ్తుంది..? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది..? మీకు తెలుసా..? ఆ.. అయినా ఈ రోజుల్లో ఆత్మ‌లు, ప్రేతాత్మ‌లు ఏంటి అంటారా..? అలా అనుకునే వారు ఉంటే ఉంటార‌నుకోండి. వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే అస‌లు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి..? మ‌నిషి మ‌ర‌ణించాక అత‌ని ఆత్మకు ఏమ‌వుతుంది..? య‌మ‌ధ‌ర్మ రాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తారు..? త‌దిత‌ర విష‌యాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నిషి మ‌ర‌ణానంత‌రం జ‌రిగే ప‌రిణామాల గురించి హిందూ శాస్త్రం ప్ర‌కారం గ‌రుడ పురాణంలో వివ‌రించ‌బ‌డింది. మ‌రికొద్ది సెక‌న్ల‌లో చ‌నిపోతాడ‌న‌గా మ‌నిషికి సృష్టి అంతా క‌నిపిస్తుంద‌ట‌. త‌నకు ఆ స‌మయంలో దివ్య దృష్టి లాంటిది వ‌స్తుంద‌ట‌. దీంతో అత‌ను ప్ర‌పంచాన్నంత‌టినీ అర్థం చేసుకుంటాడ‌ట. కానీ ఆ క్ష‌ణంలో ఏమీ మాట్లాడ‌లేడ‌ట‌. అయితే ఆ స‌మ‌యంలోనే మ‌నిషి య‌మ‌దూత‌ల‌ను చూస్తాడ‌ట‌. వారు అత్యంత వికారంగా, న‌ల్ల‌గా, త‌ల అనేది ఒక స‌రైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్ల‌తో అత్యంత భ‌యంక‌రంగా వారు క‌నిపిస్తార‌ట‌. దీంతో మ‌నిషికి నోటి నుంచి ఉమ్మి వ‌స్తూ దుస్తుల్లోనే మూత్ర లేదా మ‌ల విసర్జ‌న చేస్తాడ‌ట‌. అనంత‌రం అన్ని స్పృహ‌ల‌ను కోల్పోయి చివ‌రికి ప్రాణం పోతుంద‌ట‌. దీంతో ఆ ప్రాణాన్ని (ఆత్మ‌ను) య‌మ‌దూత‌లు న‌ర‌కానికి తీసుకువెళ్తార‌ట‌.

Yama Dharma Raju

య‌మ‌దూత‌లు ఆత్మ‌ల‌ను న‌రకానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 47 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో దారిలో ఆత్మ‌ల‌ను య‌మ‌దూత‌లు అనేక చిత్ర‌హింస‌లు పెడ‌తార‌ట‌. త‌మ‌ను చూసి భ‌య‌ప‌డినా, ఎక్క‌డైనా ఆగినా ఆత్మ‌ల‌ను కొర‌డాల వంటి ఆయుధాల‌తో చిత‌క్కొడుతూ య‌మ‌దూత‌లు తీసుకెళ్తార‌ట‌. దీంతోపాటు న‌రకంలో విధించే శిక్ష‌ల‌ను గురించి య‌మ‌దూత‌లు ఆత్మ‌ల‌కు క‌థ‌లు క‌థ‌లుగా చెబుతార‌ట‌. దీంతో ఆత్మ‌లు ఏడుస్తాయ‌ట‌. త‌మ‌ను అక్క‌డికి తీసుకువెళ్ల‌వ‌ద్ద‌ని ప్రార్థిస్తాయ‌ట‌. అయినా య‌మ‌దూత‌లు క‌నిక‌రించ‌రు స‌రి కదా, ఇంకాస్త క‌ఠినంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఆత్మ‌ల‌ను య‌మ‌ధ‌ర్మ రాజు ముందు ప్ర‌వేశ‌పెడ‌తార‌ట‌.

న‌ర‌కంలో య‌మ‌ధ‌ర్మ‌రాజు మ‌నుషుల ఆత్మ‌ల‌కు వారు చేసిన పాప‌, పుణ్యాల ప్ర‌కారం శిక్ష‌లు వేస్తాడ‌ట‌. చిన్న చిన్న త‌ప్పులు చేసి ప‌శ్చాత్తాప ప‌డుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద య‌మ‌ధ‌ర్మ రాజు చూడ‌డ‌ట‌. కానీ దొంగ‌త‌నం, హ‌త్య వంటి నేరాల‌కు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా శిక్ష ప‌డే తీరుతుంద‌ట‌. అబ‌ద్దాన్ని కూడా పాపం గానే ప‌రిగ‌ణిస్తార‌ట‌. అయితే పాప‌, పుణ్యాల‌ను లెక్కించ‌డానికి ముందు య‌ముడు ఆత్మ‌ల‌ను మ‌రోసారి భూలోకానికి వారి బంధువుల వ‌ద్ద‌కు పంపిస్తాడ‌ట‌.

ఈ క్ర‌మంలో ఆత్మ‌కు చెందిన వారు హిందూ ధ‌ర్మ శాస్త్రం ప్ర‌కారం క‌ర్మ‌కాండ‌లు, పిండ ప్ర‌దానాలు అన్నీ చేయాల్సి ఉంటుంద‌ట‌. ఇవ‌న్నీ మ‌నిషి చ‌నిపోయిన 10 రోజుల్లో పూర్తి చేయాల‌ట‌. లేదంటే య‌మ‌లోకం నుంచి వ‌చ్చిన ఆత్మ అక్క‌డే చెట్ల‌పై తిరుగుతుంద‌ట‌. ఈ క‌థంతా విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉంటుంది కానీ, గ‌రుడ పురాణంలో దీన్ని చెప్పారు. అది చ‌దివితే ఇంకా మ‌రిన్ని విష‌యాలు తెలిసేందుకు అవ‌కాశం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

పాపం నిధి అగ‌ర్వాల్.. రెండు సినిమాలు ఫ్లాప్‌.. ఇప్పుడెలా..? కెరీర్ డైలమాలో ‘ఇస్మార్ట్’ బ్యూటీ!

నిధి అగర్వాల్ కెరీర్‌లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…

Thursday, 5 February 2026, 9:38 PM

గూగుల్ పిక్సెల్ 10a వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? విడుదల తేదీ ఎప్పుడంటే..?

గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…

Thursday, 5 February 2026, 7:46 PM

ఫిబ్ర‌వ‌రి 26న పెళ్లి..? ర‌ష్మిక మౌనానికి అర్థం ఏమిటి..? ఫ్యాన్స్‌లో మొదలైన చర్చ!

నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…

Thursday, 5 February 2026, 6:46 PM

యూపీఎస్సీ సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష 2026 నోటిఫికేష‌న్‌: ఖాళీల సంఖ్య‌, చివ‌రి తేదీ, ఇత‌ర వివ‌రాలు ఇవే..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్‌ను…

Thursday, 5 February 2026, 5:15 PM

తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో వైసీపీ హ‌యాంలో అక్ర‌మాలు జ‌రిగాయి: సీఎం చంద్ర‌బాబు

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…

Thursday, 5 February 2026, 4:00 PM

షుగ‌ర్ ఉన్న‌వారికి ప్ర‌ముఖ వైద్యుడు సూచించిన ఆరు సూప‌ర్ ఫుడ్స్‌..!

మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ‌డం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…

Thursday, 5 February 2026, 2:01 PM

భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదు.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన! టీ20 వరల్డ్ కప్‌లో ఉత్కంఠ.

భారత్‌తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…

Thursday, 5 February 2026, 10:47 AM

మార్చి రేసు నుంచి చరణ్, అడివి శేష్ అవుట్.. బాబాయ్ కోసమేనా? కారణాలివే!

మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ ప‌వన్…

Thursday, 5 February 2026, 10:13 AM