Yama Dharma Raju : మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది..? అతని శరీరాన్నయితే ఖననం చేస్తారు. మరి ఆత్మ సంగతి..? అది ఎక్కడికి వెళ్తుంది..? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది..? మీకు తెలుసా..? ఆ.. అయినా ఈ రోజుల్లో ఆత్మలు, ప్రేతాత్మలు ఏంటి అంటారా..? అలా అనుకునే వారు ఉంటే ఉంటారనుకోండి. వారి సంగతి పక్కన పెడితే అసలు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి..? మనిషి మరణించాక అతని ఆత్మకు ఏమవుతుంది..? యమధర్మ రాజు దగ్గరికి ఎలా వెళ్తారు..? తదితర విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి మరణానంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్రం ప్రకారం గరుడ పురాణంలో వివరించబడింది. మరికొద్ది సెకన్లలో చనిపోతాడనగా మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందట. తనకు ఆ సమయంలో దివ్య దృష్టి లాంటిది వస్తుందట. దీంతో అతను ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకుంటాడట. కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడట. అయితే ఆ సమయంలోనే మనిషి యమదూతలను చూస్తాడట. వారు అత్యంత వికారంగా, నల్లగా, తల అనేది ఒక సరైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్లతో అత్యంత భయంకరంగా వారు కనిపిస్తారట. దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తుల్లోనే మూత్ర లేదా మల విసర్జన చేస్తాడట. అనంతరం అన్ని స్పృహలను కోల్పోయి చివరికి ప్రాణం పోతుందట. దీంతో ఆ ప్రాణాన్ని (ఆత్మను) యమదూతలు నరకానికి తీసుకువెళ్తారట.
యమదూతలు ఆత్మలను నరకానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 47 రోజుల సమయం పడుతుందట. ఈ క్రమంలో దారిలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలు పెడతారట. తమను చూసి భయపడినా, ఎక్కడైనా ఆగినా ఆత్మలను కొరడాల వంటి ఆయుధాలతో చితక్కొడుతూ యమదూతలు తీసుకెళ్తారట. దీంతోపాటు నరకంలో విధించే శిక్షలను గురించి యమదూతలు ఆత్మలకు కథలు కథలుగా చెబుతారట. దీంతో ఆత్మలు ఏడుస్తాయట. తమను అక్కడికి తీసుకువెళ్లవద్దని ప్రార్థిస్తాయట. అయినా యమదూతలు కనికరించరు సరి కదా, ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఆత్మలను యమధర్మ రాజు ముందు ప్రవేశపెడతారట.
నరకంలో యమధర్మరాజు మనుషుల ఆత్మలకు వారు చేసిన పాప, పుణ్యాల ప్రకారం శిక్షలు వేస్తాడట. చిన్న చిన్న తప్పులు చేసి పశ్చాత్తాప పడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద యమధర్మ రాజు చూడడట. కానీ దొంగతనం, హత్య వంటి నేరాలకు మాత్రం తప్పనిసరిగా శిక్ష పడే తీరుతుందట. అబద్దాన్ని కూడా పాపం గానే పరిగణిస్తారట. అయితే పాప, పుణ్యాలను లెక్కించడానికి ముందు యముడు ఆత్మలను మరోసారి భూలోకానికి వారి బంధువుల వద్దకు పంపిస్తాడట.
ఈ క్రమంలో ఆత్మకు చెందిన వారు హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కర్మకాండలు, పిండ ప్రదానాలు అన్నీ చేయాల్సి ఉంటుందట. ఇవన్నీ మనిషి చనిపోయిన 10 రోజుల్లో పూర్తి చేయాలట. లేదంటే యమలోకం నుంచి వచ్చిన ఆత్మ అక్కడే చెట్లపై తిరుగుతుందట. ఈ కథంతా వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, గరుడ పురాణంలో దీన్ని చెప్పారు. అది చదివితే ఇంకా మరిన్ని విషయాలు తెలిసేందుకు అవకాశం ఉంటుంది.
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…