Barasala : బిడ్డ పుట్టిన తర్వాత చేసే వేడుకలు చాలా ఉంటాయి. ఉయ్యాలో వేయడం, పేరు పెట్టడం, అన్నప్రాసన ఇలా.. బారసాల వేడుకని నామకరణ వేడుక అని కూడా అంటారు. బారసాలకి సంబంధించిన ముఖ్య విషయాలని ఈరోజు తెలుసుకుందాం. బారసాలని సాధారణంగా పిల్లల పుట్టిన 11వ రోజు చేస్తారు. లేదంటే 16వ రోజు, 21వ రోజు, మూడవ నెల లేదంటే 29వ నెలలో జరుపుతారు. పండితులు చేత ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించి బారసాల చేయాలి.
బారసాల వేడుకలో కొన్ని పూజలని కూడా ప్రత్యేకించి చేస్తూ ఉంటారు. బారసాల వేడుక నాడు ఏం చేయాలనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంట్లో ఏ పూజ చేయాలన్నా కూడా మొదట ఇంటిని శుభ్రపరచాలి. బారసాల నాడు కూడా ఇంటిని ముందు శుభ్రం చేసుకోవాలి. తర్వాత శిశువుకి స్నానం చేయించాలి. కొత్త బట్టలు వేయాలి. ఉయ్యాలలో ఆరోజు ఉంచుతారు. మొదట వినాయకుడికి పూజ చేయిస్తారు.
తర్వాత పుణ్యవచనాన్ని చేస్తారు. ఆ తర్వాత కటి సూత్రధారణ చేస్తారు. కొంతమంది బిడ్డ పేరుని నిశ్చయించేటప్పుడు జన్మ నక్షత్రం ప్రకారం పెడతారు. కొంతమంది ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు నామకరణ చేస్తారు. కొంతమంది సంప్రదాయం ప్రకారం బిడ్డని ఉయ్యాల్లో పడుకోబెట్టి సాంప్రదాయ పాటలు పాడుతారు. ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు. బిడ్డని కుటుంబంలో వారి పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు. పేరు పెట్టేటప్పుడు తండ్రి శిశువు పేరుని శిశువు చెవిలో మూడు సార్లు చెప్తారు.
నేలమీద లేదంటే పళ్లెంలో పరిచిన బియ్యం మీద కూడా ఈ పేరుని రాయిస్తారు. పిల్లల మావయ్య ఆవు పాలు, తేనె మిశ్రమంలో ముంచిన బంగారు ఉంగరాన్ని తీసుకుని, శిశువు నాలుక మీద మొదట ఉంచుతారు. తర్వాత అక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా ఆశీర్వదిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి ఆ రోజు బట్టలు పెడతారు. సాంప్రదాయం ప్రకారం వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టాలనుకుంటే భోజనాన్ని పెడతారు. పేరు పెట్టిన రోజే ఉయ్యాలో వేయడం, బావిలో చేద వేయడం వంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. బావిలో చేద వేయడం అంటే అప్పటివరకు అమ్మాయి పనులేమీ చేయదు. కానీ ఆ రోజు నుండి ఆమె పనులు చేసుకోవాలని ఇలా మొదలు పెడతారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…