Ants : అన్నదానం అన్నింటికంటే చాలా మంచిదని అంటారు. అన్నం లేని వాళ్ళకి కొంచెం అన్నం పెడితే, ఎంతో పుణ్యం కలుగుతుందని అంటారు. అలానే చీమలకి కూడా ఆహారాన్ని పెడితే చాలా మంచిదని పెద్దలు చెప్పడం, మీరు వినే ఉంటారు. చీమలకి ఆహారం పెడితే నిజంగా చాలా మంచి కలుగుతుందట. బియ్యం పిండిలో చక్కెర లేదంటే బెల్లం కలిపి చీమలకి పెడితే ఎంతో పుణ్యం కలుగుతుంది. లేదంటే చీమలకి వట్టి చక్కెరనైనా కూడా పెట్టొచ్చు.
ఇలా కనుక చీమలకి ఆహారం పెడితే 10,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుందట. అయితే, ఇళ్లల్లో మనుషులు తిరిగే చోట కాకుండా చీమలు ఉండే చోట వీటిని పెడితే చక్కటి ఫలితం కలుగుతుంది. తేనెని తమలపాకులో లేదంటే రావి ఆకులో పెట్టి సూర్యుడికి, తులసికి పూజ చేసి నైవేద్యం పెట్టి అక్కడ వదిలేయాలి. ఇలా చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది.
తేనెను చీమలకి పెడితే దోషాలు పోతాయి. అయితే, ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది మనం చేసిన దానం వల్లే. ఈరోజు బాగున్న వాళ్ళు ఒకప్పుడు గొప్ప గొప్ప దానాలు చేసిన వాళ్ళు. దానం చేస్తే దరిద్రం నుండి బయటపడొచ్చు. అయితే ఏమీ లేని ఒక వ్యక్తి దానం ఏమీ చేయడానికి లేదని బాధపడుతూ ఉంటే, అప్పుడు తోటకూర ఉంది కదా దానం చేయి అని మిత్రుడు చెప్తాడు. అది విని అతను తోటకూర దానం చేస్తాడు. ఆ దానంతో సిరిసంపదలు కలుగుతాయి. తర్వాత జీవితం అంతా కూడా హాయిగా ఉంటాడు.
ఇంకో జన్మలో అతను ఒక దేశానికి రాజుగా పుడతాడు. పూర్వ జన్మ జ్ఞానం కూడా ఉంటుంది. తాను చేసిన దానం వల్లే సిరి సంపదలు వచ్చాయని తెలుస్తుంది. అప్పుడు, రాజ్యం అంతా తోటకూరని పండించి, దానం చేయాలని అనుకుంటాడు. అయితే ఆ రాజు దగ్గరికి సన్యాసి వచ్చి పూర్వజన్మలో నీకు ఏమీ లేదు తోటకూర ఇచ్చావ్ కాబట్టి నీకు ఫలితం ఉంది. ఈ జన్మలో నీకు అన్నీ ఉన్నాయి. నువ్వు తోటకూర దానం చేస్తే, ఎలాంటి ఫలితం ఉంటుంది అని చెప్తాడు. అయితే శక్తి లేని వాళ్ళు వున్నది ఏమి ఇచ్చినా కొంచెం ఫలితం వస్తుంది. అన్నీ ఉన్నవాళ్లు వారి శక్తి కొద్దీ దానం చేస్తే మంచిది. అయితే, చీమలకి చక్కెర వేస్తే పదివేల మందికి దానం చేసిన పుణ్యం కలుగుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…