Tirumala : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా మతాలకు చెందిన ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకెల్లా అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న రెండో పుణ్య క్షేత్రం తిరుమల. మొదటి స్థానంలో వాటికన్ సిటీ ఉంది. అయితే తిరుమలకు, ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టతను గూర్చి అందరికీ తెలుసు. అక్కడ ఏడుకొండల్లో కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే అన్ని సమస్యలు పోయి, కష్టాల నుంచి గట్టెక్కుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే నిత్యం కొన్ని వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడైతే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో స్వామి వారి హుండీ ఆదాయం రోజుకు కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది.
అయితే వెంకటేశ్వర స్వామికి అంతటి ఆదాయం వస్తుండడాన్ని పక్కన పెడితే ఆయనను భక్తులు రెండు పేర్లతో పిలుచుకుంటారు. అది ఒకటి ఆపదమొక్కుల వాడని, ఇంకోటి వడ్డీ కాసుల వాడని. కోరిన కోర్కెలు తీర్చి, ఆపదల నుంచి గట్టెక్కించి, అంతా శుభమే కలిగించే వాడు కావడం వల్ల ఆయనకు ఆపద మొక్కుల వాడని పేరు వచ్చింది. అయితే వడ్డీ కాసుల వాడనే పేరు రావడం వెనుక గల కారణం ఏమిటో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకం వచ్చాడట. అయితే లక్ష్మీ దేవిని వైకుంఠంలోనే వదిలి రావడంతో ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. దీంతో పెళ్లికి డబ్బు పుట్టలేదు. ఈ క్రమంలో కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పెళ్లికయ్యే ధనం మొత్తం ఇచ్చాడట. ఒక సంవత్సరంలోగా ఆ అప్పు తీరుస్తానని వెంకటేశ్వర స్వామి చెప్పాడట. అయితే తీరా సంవత్సరం దాటే సరికి వెంకటేశ్వర స్వామి ఆ ధనం అప్పు తీర్చకుండా వడ్డీ కడతాడట. అప్పటి నుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వడ్డీ అలాగే పెరిగీ పెరిగీ చాలా పెద్ద మొత్తమే అవుతూ వస్తుందట. అయినా స్వామి మాత్రం వడ్డీనే కడుతూ వస్తున్నాడట. అందుకే ఆయనకు వడ్డీ కాసుల వాడని పేరు వచ్చింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…