Sri Rama Navami 2024 : శ్రీరాముడు చైత్ర మాసం శుక్ల పక్షం నవమి రోజున జన్మించాడన్న సంగతి మనకు తెలిసిందే. ఆ రోజున మనం ఎంతో భక్తి శ్రద్దలతో అంగరంగవైభవంగా శ్రీరామనవమిని జరుపుకుంటాము. అయోధ్య మహారాజు దశరథుడు మరియు తల్లి కౌసల్య యొక్క కుమారుడిగా శ్రీరాముడు జన్మించాడు. తల్లి కౌసల్యకు శ్రీరాముడు తన గొప్ప రూపాన్ని దర్శనం ఇచ్చినప్పుడు కౌసల్య అతన్ని చిన్న పిల్లలా ఆడుకోమని ముకుళిత హస్తాలతో అభ్యర్థించింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 17వ తేదీన మనం శ్రీరామనవమిని జరుపుకోనున్నాము. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. కనుక ఈ రోజు ప్రత్యేక పూజలు చేయడం వల్ల జీవితంలో సమస్యల నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు.
శత్రువుల సమస్య కూడా తగ్గుతుంది. శ్రీరామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం వల్ల మనకు కలిగే శుభఫలితాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో వారి పుట్టిన రోజును జరుపుకున్నట్టే ఈ రోజు శ్రీరాముడి పుట్టిన రోజును జరుపుకోవాలి. మీ స్వంత చేతులతో ఇంట్లోనే తీపిని తయారు చేసి అందరికి పంచి పెట్టాలి. అలాగే ఈ రోజు హనుమంతునికి కూడా ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆశ్వీరాదం ఇస్తున్న భంగిమలో ఉన్న హనుమాన్ చిత్రాన్ని ఉంచి, ఈ చిత్రం ముందు కూర్చుని పూజ చేయాలి. రామచరితమానస్ లోని రామావతారంలోని ద్విపదలను చదవాలి. అలాగే చప్పట్లు కొడుతూ శ్రీ రామ్ జై రామ్ జైజై రామ్ అనే మంత్రాన్ని చదవాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని కృప మన మీద ఉంటుంది.
జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. ఇలా కుటుంబంలోని అందరూ చేయడం వల్ల కుటుంబ సభ్యుల కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో గడుపుతారు. అలాగ శత్రు భయం ఉన్న వారు శ్రీరామనవమి రోజున ఎర్రటి వస్త్రంపై శ్రీరాముడి దర్బార్ ఫోటోను ఉంచి పూల మాలలతో అలంకరించాలి. తరువాత నెయ్యి దీపం వెలిగించి భజనలు , కీర్తనలు చేయాలి. రామరక్ష స్తోత్రాన్ని చదవాలి. ఇలా చేయడం వల్ల సుధారన్ కవచాన్ని పొందుతారు. ఇలా చేసిన వారిని హనుమంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. శ్రీరామనవమి రోజు నుండి రోజూ రామరక్షా స్తోత్రాన్ని చదవడం అలవాటు చేసుకోంది. ఇలా చేయడం వల్ల శత్రవుల భయం తగ్గుతుంది. శ్రీరామనవమి నాడు ఈ విధంగా చేయడం వల్ల జీవితంలో కష్టాలు, చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలిగిపోవడంతో పాటు శత్రవుల పీడ నుండి కూడా విముక్తి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…