Naivedyam : దేవుడి ఆరాధనలో ప్రధానమైనది నైవేద్య నివేదన.. గుడిలో దేవుడికే కాదు, ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు, వ్రతాలు చేసినప్పుడు, ప్రత్యేక పూజలప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించడం సాధారణం. అలాంటి నైవేద్య నివేదన చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. దానివల్ల ఉత్తమగతులు పొందే అవకాశాలను కోల్పోతుంటాం. కాబట్టి ఇకపై నైవేద్య నివేదన చేసేప్పుడు ఈ నియమాలను తప్పక పాటించండి.
నైవేద్యం ప్లాస్టిక్, స్టీల్, గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్య నివేదనానికి బంగారు, వెండి లేదా రాగి పాత్రలను మాత్రమే వాడాలి. వేడిగా ఉన్న పదార్దాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది. అలా అని చల్లని పదార్దాలను కూడా నైవేద్యానికి పెట్టకూడదు. గోరువెచ్చని పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎవరైతే నైవేద్య పదార్థాలను తయారు చేస్తారో వాళ్లే నివేదన చేయాలి. అలాకాకుండా వేరొకరి చేత చేయించినట్టయితే నా తరపున వేరొకరు నివేదన చేస్తున్నారు, అపరాధం ఉంటే క్షమించమని అడగాలి.
ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ గృహస్తు మాత్రమే నైవేద్య నివేదన చేయాలి. వేరొకరు పనికి రారు. బయటకొన్న పదార్థాలను, అతిగా పులిసినవి, ఇంట్లో తయారు చేసినవే అయినప్పటికీ, అతిగా పులుపువి, అతి కారంగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు. నైవేద్యం పెట్టిన వ్యక్తి తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిముషాలు అలాగే వదిలేసి మనం పూజగదిలో నుండి వచ్చేయాలి. ఇలా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది.
నైవేద్యం ఎప్పుడూ కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడి కోసం విడిగా పెడితే అది మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారుచేసి పెట్టుకుంటే, మరికొందరు అప్పటికప్పుడు సిద్ధం చేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవికావని శాస్త్రం చెబుతోంది. నైవేద్యం పెట్టే సమయంలో ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతా స్త్రోత్రం చదవాలి. ఏ కులస్థులైనా సరే, ఏ దేవీ దేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి, అమ్రుతమస్తు, అమ్రుతోపస్తరణమసి స్వాహా.. అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి.
తర్వాత ఓం ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓమ్ బ్రహ్మణే స్వాహా.. అని కుడిచేత్తో ఆహార పదార్థాల్ని దేవుళ్లకు చూపించాలి. మధ్యే మద్యదే పానీయం సమర్పయామి.. అని.. నైవేద్యే పానీయం సమర్పయామి.. అని నైవేద్యం మీద మళ్ళీ నీటి బిందువుల్ని ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి. ఇలా దేవుళ్లు, దేవతలకు నైవేద్యాలను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే సరైన పద్ధతిని పాటించినట్లు లెక్క. ఇలా కాకుండా తప్పుగా నైవేద్యం పెడితే అన్నీ అనర్థాలే కలుగుతాయి.. అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…