ఆధ్యాత్మికం

Naivedyam : దేవుడికి స‌రైన ప‌ద్ధ‌తిలోనే నైవేద్యం పెడుతున్నారా.. లేదా.. తెలుసుకోండి..!

Naivedyam : దేవుడి ఆరాధనలో ప్రధానమైనది నైవేద్య‌ నివేదన.. గుడిలో దేవుడికే కాదు, ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు, వ్రతాలు చేసినప్పుడు, ప్రత్యేక పూజలప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించడం సాధారణం. అలాంటి నైవేద్య‌ నివేద‌న చేసేట‌ప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. దానివల్ల ఉత్తమగతులు పొందే అవకాశాలను కోల్పోతుంటాం. కాబట్టి ఇకపై నైవేద్య‌ నివేద‌న చేసేప్పుడు ఈ నియమాల‌ను తప్పక పాటించండి.

నైవేద్యం ప్లాస్టిక్, స్టీల్, గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్య‌ నివేదనానికి బంగారు, వెండి లేదా రాగి పాత్రలను మాత్రమే వాడాలి. వేడిగా ఉన్న పదార్దాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది. అలా అని చల్లని పదార్దాల‌ను కూడా నైవేద్యానికి పెట్టకూడదు. గోరువెచ్చని పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎవరైతే నైవేద్య‌ పదార్థాలను తయారు చేస్తారో వాళ్లే నివేద‌న చేయాలి. అలాకాకుండా వేరొకరి చేత చేయించినట్టయితే నా తరపున వేరొకరు నివేద‌న చేస్తున్నారు, అపరాధం ఉంటే క్షమించమని అడగాలి.

Naivedyam

ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ గృహస్తు మాత్రమే నైవేద్య‌ నివేద‌న చేయాలి. వేరొకరు పనికి రారు. బయటకొన్న పదార్థాలను, అతిగా పులిసినవి, ఇంట్లో తయారు చేసినవే అయినప్పటికీ, అతిగా పులుపువి, అతి కారంగా ఉన్న పదార్థాల‌ను నైవేద్యంగా పెట్టకూడదు. నైవేద్యం పెట్టిన వ్యక్తి తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిముషాలు అలాగే వదిలేసి మనం పూజగదిలో నుండి వచ్చేయాలి. ఇలా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది.

నైవేద్యం ఎప్పుడూ కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడి కోసం విడిగా పెడితే అది మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారుచేసి పెట్టుకుంటే, మరికొందరు అప్పటికప్పుడు సిద్ధం చేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవికావని శాస్త్రం చెబుతోంది. నైవేద్యం పెట్టే సమయంలో ఆహార‌ పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతా స్త్రోత్రం చదవాలి. ఏ కులస్థులైనా సరే, ఏ దేవీ దేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి, అమ్రుతమస్తు, అమ్రుతోపస్తరణమసి స్వాహా.. అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి.

తర్వాత ఓం ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓమ్ బ్రహ్మణే స్వాహా.. అని కుడిచేత్తో ఆహార పదార్థాల్ని దేవుళ్ల‌కు చూపించాలి. మధ్యే మద్యదే పానీయం సమర్పయామి.. అని.. నైవేద్యే పానీయం సమర్పయామి.. అని నైవేద్యం మీద మళ్ళీ నీటి బిందువుల్ని ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి. ఇలా దేవుళ్లు, దేవ‌త‌ల‌కు నైవేద్యాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అప్పుడే స‌రైన ప‌ద్ధ‌తిని పాటించిన‌ట్లు లెక్క‌. ఇలా కాకుండా త‌ప్పుగా నైవేద్యం పెడితే అన్నీ అన‌ర్థాలే క‌లుగుతాయి.. అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా…

Thursday, 12 March 2026, 4:59 PM

ఐపీఎల్ 2026పై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా.. ఆ వార్తల్లో నిజం లేదు!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…

Thursday, 12 March 2026, 3:06 PM

ఆనంద్‌ దేవరకొండ షేర్ చేసిన క్రేజీ వీడియో.. విజయ్, రష్మిక డ్యాన్స్‌ అదుర్స్!

నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…

Thursday, 12 March 2026, 12:11 PM

‘ఆ 100 విజయాలు వేస్ట్’.. వరల్డ్ కప్ గెలిచాక గంభీర్ స్పీచ్‌! సూర్యకుమార్ షాకింగ్ రివీల్.

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…

Thursday, 12 March 2026, 10:50 AM