ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షం అంటారు. ఈ మహాలయ పక్షంలో మనం మన చనిపోయిన పూర్వీకులకు, పెద్దవారికి పిండ ప్రదానాలను చేస్తూ వారి ఆత్మ శాంతించాలని వారి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. మన పెద్దలకు ఎంతో పవిత్రంగా పూజలు చేసే ఈ రోజులలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి మహాలయపక్షంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
మహాలయ పక్షంలో మనం మన పెద్దవారికి పిండ ప్రదానాలు చేస్తాము కనుక ఈ 15 రోజులు ఏ విధమైనటువంటి శుభకార్యాలను జరపకూడదు. అదే విధంగా కొత్త వాహనాలను, కొత్త ఇంటిని కొనుగోలు చేయకూడదు. ఈ పదిహేను రోజులలో ఏ విధమైనటువంటి మాంసాహారాన్ని, ఉల్లిపాయ, వెల్లుల్లి కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా మహాలయ పక్షంలో ఉండే 15 రోజులను సంతాప దినాలుగా భావిస్తాము కనుక ఈ పదిహేను రోజులు మగవారు ఎలాంటి పరిస్థితులలో కూడా కటింగ్ చేయించుకోవడం, షేవింగ్ చేసుకోవడం వంటివి చేయకూడదు. అలాగే ఇంటిలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా నియమాలను పాటించడం వల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగి మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…