Deepam : ప్రతి ఒక్క ఇంట్లో కూడా రోజూ దీపారాధన చేయాలి. దీపారాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. మరి దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలను కచ్చితంగా పాటించాలి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. రోజూ రెండు సార్లు దీపం పెట్టాలి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తే మంచిది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ స్వరూపం. మనలో నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతుంటుంది.
దీపంలోనే దేవతలు అందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే మీరు వెలిగించిన చోట దైవశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు. దేవతలు అందరూ కూడా వస్తారు. ప్రత్యేకమైన నియమాలంటూ ఏమీ లేవు. ఉదయం స్నానం చేశాక దీపాన్ని వెలిగించవచ్చు. సాయంత్రం కూడా స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి. మాంసాహారం తినే వారు కూడా ప్రతి రోజూ దీపారాధన చేయడానికి తలస్నానం చేయక్కర్లేదు. మామూలు స్నానం చేస్తే చాలు.
దీపం పెట్టే ప్రమిద బంగారంతో చేసింది కానీ వెండి, ఇత్తడి లేదంటే మట్టిదైనా కూడా ఫరవాలేదు. దీపపు ప్రమిదని ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపం పెట్టే ప్రమిద స్టీలు, ఇనుపది అయ్యి ఉండకూడదు. దీపం పెట్టడానికి ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉన్న తర్వాత మాత్రమే దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడవాలి. బియ్యపు పిండితో ముగ్గు వేసి, కొంచెం పసుపు, కుంకుమ చల్లి ఆ తర్వాత దీపం వెలిగించాలి. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు. అది అశుభ సూచికం. కనీసం రెండు వత్తులైనా సరే వెలిగించాలి. దీపారాధనకి ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిది.
లేదంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. ఏ ఇంట అయితే రెండు పూటలా దీపం వెలుగుతుందో, ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దుష్టశక్తులన్నీ పోయి ఆ ఇంట అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. దీపారాధన చేసే వారికి గ్రహ దోషాలు, పీడలు వంటివి ఉండవు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…