Deepam : హిందూ సంప్రదాయంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గుళ్లల్లో, ఇంట్లో పూజ చేసేప్పుడు దేవుడు ముందు దీపం పెట్టడం సహజం. పూజలు పెద్దగా చేయనివాళ్లు, చేయలేని వాళ్లు కూడా దేవుడి ముందు దీపం పెట్టి దండం పెట్టుకుంటారు. అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి. చీకటిలో వెలుగులు విరజిమ్మే పండుగ. దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుదీరతాయి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న దీపాల్ని పెట్టేటప్పుడు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని పొరపాటు చేయకుండా దీపం వెలిగించండి.
దీపాన్ని దేవతా స్వరూపంగా చూస్తారు. అడుగుభాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, ప్రమిదలో శివుడు, వెలుగులో సరస్వతి, నిప్పు కణికలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని శాస్త్రం చెబుతుంది. అందుకే ప్రమిదకు గంధం, కుంకుమ బొట్టు, పూవులు పెట్టి, నమస్కరించి అక్షతలు వేస్తారు కొందరు. అంతేకాదు దీపానికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. లోహపు ప్రమిదల కంటే మట్టి ప్రమిదలు మంచిది. లోహాలు వేడెక్కడం వలన భూమి వేడెక్కుతుంది. అదే మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి. ఇళ్లల్లో పూజకు వాడేప్పుడు వెండి, ఇత్తడి ప్రమిదలు వాడొచ్చు.. కానీ స్టీలు ప్రమిదలు వాడకూడదు.
దీపంలో వత్తులు ఎన్ని పడితే అన్ని, ఎలా పడితే అలా వేసి దీపం వెలిగించకూడదు. దీపంలో రెండు వత్తులు వేసి, అది కూడా ఆ రెండింటిని కలిపి దీపం వెలిగించాలి. దీపం అనగానే ఆముదంతో లేదా నూనెతో వెలిగిస్తుంటారు. కానీ పండుగనాడైనా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. నెయ్యి లేని పక్షంలో నువ్వుల నూనె వాడడం ఉత్తమం. దీపాన్ని వెలిగించాక దీపం ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని శాస్త్రోక్తి. పూర్వం సర్వం కోల్పోయిన ఇంద్రుడు దీపారాధన వలననే సిరిసంపదలు తిరిగి పొందాడట. అందుకే దీపాలు పెట్టిన ఇంట సకల ఐశ్వర్యాలు కొలువవుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…