Fasting : ఇష్టం దైవం పేరిట వారంలో నిర్దిష్టమైన రోజునో, శివరాత్రి వంటి పర్వదినాల్లోనో, ఇతర వ్రతాలు, పూజలు చేసినప్పుడో హిందువుల్లో అధిక శాతం మంది దేవుడికి ఉపవాసం ఉంటారు. ఇది చాలా సహజం. ఆ మాటకొస్తే ముస్లింలు కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే నిజంగా ఇలా ఉపవాసాలు ఉండడం మంచిదేనా..? అంటే.. మంచిదే.. అని సైన్స్ చెబుతోంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపవాస అనేది సంస్కృత పదం. ఉప అంటే దగ్గర అని, వాస అంటే ఉండడం అని అర్థం. వెరసి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఒకప్పుడు ప్రజలు ఆహారాన్ని సంపాదించడం, దాన్ని వండుకోవడం, తినడం, జీర్ణం చేసుకోవడం వంటి అంశాల పట్ల ఎక్కువగా దృష్టి సారించేవారు. ఈ నేపథ్యంలోనే వారు శారీరకంగా అలసిపోవడంతోపాటు మానసిక ఏకాగ్రత ఉండేది కాదు. దీన్ని అధిగమించేందుకే వారు తక్కువ మొత్తంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం లేదా అసలు ఆహారానికే దూరంగా ఉండడమో చేసే వారు. దీంతో శరీరం తేలిగ్గా అనిపించి మనసు కూడా ప్రశాంతమయ్యేది. దేవుడికి పూజలు, ప్రార్థనలు చేసేందుకు ఇది వారికి ఎంతగానో ఉపయోగపడేది.
ఆహారం తినకుండా అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తే జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. దీంతోపాటు శరీరంలోని ఇతర అవయవాలు కూడా మెరుగ్గా పనిచేసేందుకు వీలవుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
ఉపవాసంపై భగవద్గీతలో కూడా పలు అంశాలు పేర్కొనబడ్డాయి. ఉపవాసం అనేది ఒక వ్యక్తి పూర్తి ఇష్టంతోనే ఉండాలని, ఎవరూ ఈ విషయంలో బలవంతం చేయవద్దని గీత సారాంశం. అంతేకాదు శరీరం మరీ నీరసించి అనారోగ్యం కలిగేంతలా కూడా ఉపవాసం చేయకూడదట. ఉపవాసంలో ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…