Bell In Temple : ఆలయానికి వెళ్లిన తరువాత ముందుగా మనం చేసే పని గంటను మ్రోగించడం. ఇది మన ఆచారం కూడా. వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయంలో గంటను మ్రోగించడం వల్ల మనలో సానుకూలతను పెంచుతుంది. అయితే కొందరు ఆలయం నుండి ఇంటికి వెళ్లే సమయంలో కూడా గంటను మ్రోగిస్తూ ఉంటారు. గంట కొట్టి ఇంటికి వెళ్తూ ఉంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. అసలు గుడి నుండి ఇంటికి వెళ్లేటప్పుడు గంటను ఎందుకు మ్రోగించకూడదు.. పండితులు దీని గురించి ఏం చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం గుడి నుండి ఇంటికి వెళ్లేటప్పుడు గంటను మ్రోగించడం తప్పుగా పరిగణించబడుతుంది. సాధారణంగా మనం ఆలయంలోకి ప్రవేశించిన తరువాత గంటను మ్రోగించి ఆ తరువాతే దైవదర్శనాన్ని చేసుకుంటూ ఉంటాము. ఈ ఆచారం ఏ నాటిదో. ఇప్పటికి దీనిని మనం పాటిస్తూనే ఉన్నాం.
ఆలయంలో గంటను కొట్టడం వెనుక అనేక ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి. ధ్వని శక్తికి సంబంధించింది. కనుక ధ్వని శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఆలయంలో గంటను మోగించినప్పుడల్లా గంట మోగించేవారికి మరియు చుట్టూ ఉన్న వారికి సానుకూల శక్తి ప్రసారమవుతుంది. అలాగే స్కంద పురాణంలో ఆలయంలో గంటను మోగించేటప్పుడు వచ్చే ధ్వని ఓం ని పోలి ఉంటుందని పేర్కొన్నారు. ఓం శబ్దం చాలా స్వచ్చమైన, సానుకూల శక్తిని కలిగి ఉంటుంది. అలాగే గుడిలో గంటను మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు వస్తాయి. దీంతో చుట్టుప్రక్కల గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, క్రిములు నశిస్తాయి. ఈ విధంగా గంటను మోగించడంలో శాస్త్రీయ అంశం కూడా ఉంది.
కనుకనే మన పెద్దలు గుడిలోకి ప్రవేశించిన తరువాత గంటను మోగించే ఆచారాన్ని పెట్టారు. అయితే గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు గంటను మోగించకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా గుడి నుండి బయటకు వెళ్లేటప్పుడు గంటను మోగించడం వల్ల మనలో ఉండే సానుకూల శక్తి అక్కడే వదిలేయబడుతుంది. కనుక గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు గంటను మోగించకూడదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…