Bell In Temple : ఆలయానికి వెళ్లిన తరువాత ముందుగా మనం చేసే పని గంటను మ్రోగించడం. ఇది మన ఆచారం కూడా. వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయంలో గంటను మ్రోగించడం వల్ల మనలో సానుకూలతను పెంచుతుంది. అయితే కొందరు ఆలయం నుండి ఇంటికి వెళ్లే సమయంలో కూడా గంటను మ్రోగిస్తూ ఉంటారు. గంట కొట్టి ఇంటికి వెళ్తూ ఉంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. అసలు గుడి నుండి ఇంటికి వెళ్లేటప్పుడు గంటను ఎందుకు మ్రోగించకూడదు.. పండితులు దీని గురించి ఏం చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం గుడి నుండి ఇంటికి వెళ్లేటప్పుడు గంటను మ్రోగించడం తప్పుగా పరిగణించబడుతుంది. సాధారణంగా మనం ఆలయంలోకి ప్రవేశించిన తరువాత గంటను మ్రోగించి ఆ తరువాతే దైవదర్శనాన్ని చేసుకుంటూ ఉంటాము. ఈ ఆచారం ఏ నాటిదో. ఇప్పటికి దీనిని మనం పాటిస్తూనే ఉన్నాం.
ఆలయంలో గంటను కొట్టడం వెనుక అనేక ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి. ధ్వని శక్తికి సంబంధించింది. కనుక ధ్వని శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఆలయంలో గంటను మోగించినప్పుడల్లా గంట మోగించేవారికి మరియు చుట్టూ ఉన్న వారికి సానుకూల శక్తి ప్రసారమవుతుంది. అలాగే స్కంద పురాణంలో ఆలయంలో గంటను మోగించేటప్పుడు వచ్చే ధ్వని ఓం ని పోలి ఉంటుందని పేర్కొన్నారు. ఓం శబ్దం చాలా స్వచ్చమైన, సానుకూల శక్తిని కలిగి ఉంటుంది. అలాగే గుడిలో గంటను మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు వస్తాయి. దీంతో చుట్టుప్రక్కల గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, క్రిములు నశిస్తాయి. ఈ విధంగా గంటను మోగించడంలో శాస్త్రీయ అంశం కూడా ఉంది.
కనుకనే మన పెద్దలు గుడిలోకి ప్రవేశించిన తరువాత గంటను మోగించే ఆచారాన్ని పెట్టారు. అయితే గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు గంటను మోగించకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా గుడి నుండి బయటకు వెళ్లేటప్పుడు గంటను మోగించడం వల్ల మనలో ఉండే సానుకూల శక్తి అక్కడే వదిలేయబడుతుంది. కనుక గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు గంటను మోగించకూడదు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…