Ayodhya Ram Mandir : రామనవమి తరువాత అయోధ్యలోని రామాలయంలో కొన్ని కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి, ఆలయంలో ఇప్పటి వరకు ఒక అంతస్తు మాత్రమే సిద్దం చేయగా, అక్కడ రెండవ అంతస్తు ఇంకా సిద్దం కాలేదు. ఆలయాన్ని ప్రారంభించినప్పుడు రామ్ లాలా విగ్రహాన్ని మొదటి అంతస్తులోనే ఉంచారు. మొదటి అంతస్తుతో పాటు రెండో అంతస్తు పనులు కూడా పూర్తయ్యాయి. ఆలయ ప్రాంగణం చుట్టూ 14 అడుగుల వెడల్పుతో భద్రతా గోడను కూడా నిర్మించారు. ఇదొక్కటే కాదు కాంప్లెక్స్ మరో 6 ఆలయాలను నిర్మించడానికి ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రామ మందిర సముదాయంలో మరో 6 ఆలయాలను నిర్మించనున్నారు. ఒక మూలలో శివుని ఆలయం, మరొక వైపు మా భగవతి ఆలయం, మరొక వైపు పార్వతి ఆలయం, పూర్య భగవానుడి ఆలయం నిర్మించనున్నారు. అలాగే రామ్ లాలా చేతులకు ఒకవైపు హనుమంతుడి ఆలయం మరొక వైపు అన్నపూర్ణ ఆలయాలను నిర్మించనున్నారు. అంతేకాకుండా మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ట, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, మాతా శబరి, మాతా అహల్య, జటాయుల ఆలయాలు కూడా ఆలయ సముదాయంలో నిర్మించబడతాయి. అంతేకాకుండా ఆలయ ప్రాంగణాన్ని ఎండ తగలకుండా మార్చనున్నట్టు సమాచారం. అదే సమయంలో 25,000 మంది భక్తులు ఏకకాలంలో ఆలయం లోపల ఉండగలరు.
అంతేకాదు, యాంత్రికుల వస్తువులు ఆలయంలో ఉంచే సౌకర్యం కూడా కల్పిస్తారు. ఇక ఆలయ ప్రాంగణంలో 600 మొక్కలు నాటారు. నీటిశుద్ది కర్మాగారం మరియు మురుగు నీటి శుద్ది ప్లాంట్ సౌకర్యం కూడా ఉంది. ఇక రాంలాలా ఆలయాన్ని ప్రారంభించినప్పటి నుండి 1.5 కోట్ల మంది ప్రజలు రాం లాలాను దర్శించుకున్నారు. రాంలాలా దర్శనం కోసం మన దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు ఒక లక్ష మంది భక్తులు రాం లాలాను దర్శించుకోవడానికి వస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…