Lord Ganesha : ఏ పూజ చేయాలన్నా మొదట మనం వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే ఏ దేవుడినైనా పూజిస్తాం. వినాయకుడిని మొట్టమొదట పూజించడం వలన మనం తలపెట్టే ఏ కార్యమైనా కూడా పూర్తి అవుతుందని మన నమ్మకం. అందుకే తొలి పూజ వినాయకుడికి చేస్తారు. ఎలాంటి అవరోధాలు రాకుండా పని పూర్తి అవ్వాలని ప్రతిసారి తొలి పూజని వినాయకుడికి చేస్తారు. వినాయకుడి జీవితం నుండి నేర్చుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలని ఇప్పుడు చూసేద్దాం.
తల్లిదండ్రుల కంటే ఎవరు ఎక్కువ కాదని మనం వినాయకుడి నుండి తెలుసుకోవచ్చు. వినాయకుడు, కుమారస్వామి ఇద్దరిలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు ఒక పరీక్ష పెడతారు. ముల్లోకాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలని ఎవరైతే మొదట చుట్టి వస్తారో వాళ్లే గణాధిపతి అని అంటారు. నెమలి మీద కుమారస్వామి బయలుదేరుతాడు. వినాయకుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులను దేవుళ్ళుగా భావించి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు. ఇలా గణాధిపతి అయిపోతాడు.
విధి నిర్వహణయే ముందు.. అని మనం వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. పార్వతీ దేవి పిండి బొమ్మను చేసి కాపలాగా పెట్టి స్నానానికి వెళుతుంది. అయితే శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళబోతుంటే వినాయకుడు అడ్డుకుంటాడు. ఇలా మనం విధినిర్వహణే ముందు అని వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. ఆత్మ గౌరవమే ముఖ్యమని వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. వినాయకుడి ఆకారం నచ్చకపోవడంతో స్వర్గలోకానికి వినాయకుడిని కాపలా పెట్టి అందరూ వెళ్తారు. వినాయకుడు దేవతలకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఒక రోజు ఎలుకల సహాయంతో దేవతలు వెళ్లే దారంతా తవ్వించేస్తాడు. ఆఖరికి దేవతలు వచ్చి వినాయకుడికి క్షమాపణలు చెప్తారు.
వినాయకుడు కనీసం మధ్యలో విశ్రాంతి తీసుకోకుండా, నిరంతరాయంగా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగానే రాస్తూ ఉంటాడు. దీన్ని బట్టి చేపట్టిన పనిని వెంటనే పూర్తి చేయాలి అని మనం నేర్చుకోవచ్చు. అలానే ఓ నాడు వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వుతాడు. చంద్రుణ్ణి ఆకాశం నుండి పూర్తిగా కనబడకుండా వెళ్ళిపోమని శాపం పెడతాడు వినాయకుడు. ఆ శాపాన్ని మళ్లీ మారుస్తాడు వినాయకుడు. అంటే దీన్ని బట్టి తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి అని మనం వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…