Lord Ganesha : ఏ పూజ చేయాలన్నా మొదట మనం వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే ఏ దేవుడినైనా పూజిస్తాం. వినాయకుడిని మొట్టమొదట పూజించడం వలన మనం తలపెట్టే ఏ కార్యమైనా కూడా పూర్తి అవుతుందని మన నమ్మకం. అందుకే తొలి పూజ వినాయకుడికి చేస్తారు. ఎలాంటి అవరోధాలు రాకుండా పని పూర్తి అవ్వాలని ప్రతిసారి తొలి పూజని వినాయకుడికి చేస్తారు. వినాయకుడి జీవితం నుండి నేర్చుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలని ఇప్పుడు చూసేద్దాం.
తల్లిదండ్రుల కంటే ఎవరు ఎక్కువ కాదని మనం వినాయకుడి నుండి తెలుసుకోవచ్చు. వినాయకుడు, కుమారస్వామి ఇద్దరిలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు ఒక పరీక్ష పెడతారు. ముల్లోకాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలని ఎవరైతే మొదట చుట్టి వస్తారో వాళ్లే గణాధిపతి అని అంటారు. నెమలి మీద కుమారస్వామి బయలుదేరుతాడు. వినాయకుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులను దేవుళ్ళుగా భావించి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు. ఇలా గణాధిపతి అయిపోతాడు.
విధి నిర్వహణయే ముందు.. అని మనం వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. పార్వతీ దేవి పిండి బొమ్మను చేసి కాపలాగా పెట్టి స్నానానికి వెళుతుంది. అయితే శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళబోతుంటే వినాయకుడు అడ్డుకుంటాడు. ఇలా మనం విధినిర్వహణే ముందు అని వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. ఆత్మ గౌరవమే ముఖ్యమని వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు. వినాయకుడి ఆకారం నచ్చకపోవడంతో స్వర్గలోకానికి వినాయకుడిని కాపలా పెట్టి అందరూ వెళ్తారు. వినాయకుడు దేవతలకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఒక రోజు ఎలుకల సహాయంతో దేవతలు వెళ్లే దారంతా తవ్వించేస్తాడు. ఆఖరికి దేవతలు వచ్చి వినాయకుడికి క్షమాపణలు చెప్తారు.
వినాయకుడు కనీసం మధ్యలో విశ్రాంతి తీసుకోకుండా, నిరంతరాయంగా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగానే రాస్తూ ఉంటాడు. దీన్ని బట్టి చేపట్టిన పనిని వెంటనే పూర్తి చేయాలి అని మనం నేర్చుకోవచ్చు. అలానే ఓ నాడు వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వుతాడు. చంద్రుణ్ణి ఆకాశం నుండి పూర్తిగా కనబడకుండా వెళ్ళిపోమని శాపం పెడతాడు వినాయకుడు. ఆ శాపాన్ని మళ్లీ మారుస్తాడు వినాయకుడు. అంటే దీన్ని బట్టి తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి అని మనం వినాయకుడిని చూసి నేర్చుకోవచ్చు.
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…