నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. అయితే కత్తి మహేష్ మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు బుధవారం పలువురిని ప్రశ్నించారు.
కత్తి మహేష్ కారు డ్రైవర్ సురేష్ను పోలీసులు నెల్లూరుకు పిలిపించి విచారణ చేపట్టారు. కోవూరు పోలీస్ స్టేషన్లో సురేష్ను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో సురేష్ అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో ఏం జరిగింది ? అన్న వివరాలను పోలీసులకు వెల్లడించాడు.
నిద్ర సమయం కావడంతో నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం. ఆలోపే ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కత్తి మహేష్ నిద్రపోతున్నారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల ఆయన ముందుకు పడిపోయారు. నేను సీటు బెల్ట్ పెట్టుకున్నా. అందువల్లే నాకేమీ కాలేదు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డా. కంటెయినర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. అని సురేష్ తెలిపాడు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ పగిలిన అద్దాల ముక్కలు మహేష్ కంటికి గుచ్చుకున్నాయి. హైవే పెట్రోలింగ్ పోలీసుల సహాయంతో మహేష్ను వెంటనే హాస్పిటల్లో చేర్చా. విచారణకు సహకరిస్తా. ఈ కేసులో నన్ను అనుమానించాల్సిన పనిలేదు.. అని సురేష్ అన్నాడు. కాగా పోలీసులు ఈ కేసులో మరికొంత మందిని విచారించనున్నారు.
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…