గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి ప్రపంచంపై తన విశ్వరూపం చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనా బారినపడి మృతి చెందారు. మరికొందరు కరోనా భయం పట్టుకొని మృతి చెందారు. తాజాగా ఓ జంట తమకు కరోనా సోకిందేమోనని భయపడింది. దీంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళూరు పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మంగళూరులోని చిత్రపుర ప్రాంతానికి చెందిన గుణ సువర్ణ, రమేష్ కుమార్ అనే దంపతులు గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సువర్ణకు డయాబెటిస్ ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. 2000 సంవత్సరంలో వీరి వివాహం జరిగినప్పటికీ ఇప్పటి వరకు వీరికి సంతానం కలగలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలు వేధిస్తుంటే బతకాలనే ఆశ వీరిలో ఉన్నా కానీ కరోనా చంపేస్తుందన్న భయంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే కరోనా భయంతో తాము చనిపోతున్నామని సూసైడ్ లెటర్ రాసి ఆ లెటర్ పక్కనే లక్ష రూపాయలు ఉంచి ఆ లక్ష రూపాయలతో తమ అంత్యక్రియలు నిర్వహించాలని రాశారు. అలాగే మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ కు ఇదే విషయాన్ని వాయిస్ మెసేజ్ చేశారు. అయితే ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేలోపే వారిద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని మంగళూరు సిటీ కమిషనర్ తెలియజేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…