గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి ప్రపంచంపై తన విశ్వరూపం చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనా బారినపడి మృతి చెందారు. మరికొందరు కరోనా భయం పట్టుకొని మృతి చెందారు. తాజాగా ఓ జంట తమకు కరోనా సోకిందేమోనని భయపడింది. దీంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళూరు పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మంగళూరులోని చిత్రపుర ప్రాంతానికి చెందిన గుణ సువర్ణ, రమేష్ కుమార్ అనే దంపతులు గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సువర్ణకు డయాబెటిస్ ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. 2000 సంవత్సరంలో వీరి వివాహం జరిగినప్పటికీ ఇప్పటి వరకు వీరికి సంతానం కలగలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలు వేధిస్తుంటే బతకాలనే ఆశ వీరిలో ఉన్నా కానీ కరోనా చంపేస్తుందన్న భయంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే కరోనా భయంతో తాము చనిపోతున్నామని సూసైడ్ లెటర్ రాసి ఆ లెటర్ పక్కనే లక్ష రూపాయలు ఉంచి ఆ లక్ష రూపాయలతో తమ అంత్యక్రియలు నిర్వహించాలని రాశారు. అలాగే మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ కు ఇదే విషయాన్ని వాయిస్ మెసేజ్ చేశారు. అయితే ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేలోపే వారిద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని మంగళూరు సిటీ కమిషనర్ తెలియజేశారు.
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…