క్రైమ్‌

దారుణం.. కూల్ డ్రింక్ తాగిన బాలిక వాంతులు చేసుకుని మృతి.. శ‌రీరం మొత్తం నీలి రంగులోకి మారింది..

చెన్నైలో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ తాగిన ఓ బాలిక ర‌క్తంలో కూడిన వాంతులు చేసుకుంది. త‌రువాత ఆమె వెంట‌నే చ‌నిపోయింది. ఆమె శ‌రీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. వివ‌రాల్లోకి వెళితే..

చెన్నైలోని బీసెంట్ నగర్ లో స్థానిక కిరాణా దుకాణం నుండి 13 ఏళ్ల బాలిక ధ‌ర‌ణి ఓ కూల్ డ్రింక్‌ను కొనుగోలు చేసింది. అనంత‌రం ఆ కూల్ డ్రింక్‌ను ఆమె తాగింది. అయితే ఆమె కూల్‌డ్రింక్ తాగాక ఆమెకు ర‌క్తంతో కూడిన వాంతులు అయ్యాయి.

ఈ క్ర‌మంలో ఆమె అక్క అశ్విని తమ‌ తల్లిదండ్రులను ఇంటికి తిరిగి రమ్మని పిలిచింది. ధ‌రణిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్ప‌టికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి ధ‌రణి శరీరం మొత్తం నీలం రంగులోకి మారింది.

ఈ సంఘటన తర్వాత ఆహార భద్రత అధికారులు తాత్కాలికంగా చెన్నైలోని శీతల పానీయాల తయారీ యూనిట్‌ను మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు యూనిట్ మూసివేయబడుతుంద‌ని తెలిపారు.

కాగా వివిధ దుకాణాలకు పంపిన ఒకే బ్యాచ్ కూల్ డ్రింక్ సీసాలు 540 ఉంటే వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపుల నుండి బ్యాచ్‌ను అధికారులు రీకాల్ చేసే సమయానికి చెన్నై అంతటా 17 సీసాలు అమ్ముడయ్యాయి. బీసెంట్ నగర్ నివాసితులు తమ పరిసరాల్లో విక్రయించే ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేయాల‌ని ఆహార భద్రతా అధికారులను డిమాండ్ చేశారు.

కాగా ధ‌రణికి ఆస్తమా ఉంది. ఆమెను కూల్‌ డ్రింక్స్ తాగ‌కూడదని వైద్యులు చెప్పారు. ఈ వివ‌రాల‌ను పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదికలో, పానీయం ఆమె శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత ఊపిరాడకపోవడమే మరణానికి కారణమని చెప్పబడింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పానీయం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు పోలీసులు తెలియజేశారు. షోలవరంలోని తయారీ యూనిట్ అధికారులను త్వరలో ప్రశ్నించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM

రైలులో టికెట్ లేదా? భయపడకండి.. ఈ రూల్స్ తెలిస్తే చాలు!

రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…

Thursday, 29 January 2026, 6:12 PM

ఎస్‌బీఐలో 2050 భారీ ఉద్యోగాలు: నేటి నుంచే దరఖాస్తులు.. అర్హతలివే!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…

Thursday, 29 January 2026, 2:43 PM

విజయ్ ‘జన నాయకన్’ వివాదానికి చెక్..? కోర్టు బయటే రాజీ..? రిలీజ్‌పై తాజా అప్‌డేట్!

తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…

Thursday, 29 January 2026, 12:36 PM