చెన్నైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ తాగిన ఓ బాలిక రక్తంలో కూడిన వాంతులు చేసుకుంది. తరువాత ఆమె వెంటనే చనిపోయింది. ఆమె శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. వివరాల్లోకి వెళితే..
చెన్నైలోని బీసెంట్ నగర్ లో స్థానిక కిరాణా దుకాణం నుండి 13 ఏళ్ల బాలిక ధరణి ఓ కూల్ డ్రింక్ను కొనుగోలు చేసింది. అనంతరం ఆ కూల్ డ్రింక్ను ఆమె తాగింది. అయితే ఆమె కూల్డ్రింక్ తాగాక ఆమెకు రక్తంతో కూడిన వాంతులు అయ్యాయి.
ఈ క్రమంలో ఆమె అక్క అశ్విని తమ తల్లిదండ్రులను ఇంటికి తిరిగి రమ్మని పిలిచింది. ధరణిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి ధరణి శరీరం మొత్తం నీలం రంగులోకి మారింది.
ఈ సంఘటన తర్వాత ఆహార భద్రత అధికారులు తాత్కాలికంగా చెన్నైలోని శీతల పానీయాల తయారీ యూనిట్ను మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు యూనిట్ మూసివేయబడుతుందని తెలిపారు.
కాగా వివిధ దుకాణాలకు పంపిన ఒకే బ్యాచ్ కూల్ డ్రింక్ సీసాలు 540 ఉంటే వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపుల నుండి బ్యాచ్ను అధికారులు రీకాల్ చేసే సమయానికి చెన్నై అంతటా 17 సీసాలు అమ్ముడయ్యాయి. బీసెంట్ నగర్ నివాసితులు తమ పరిసరాల్లో విక్రయించే ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేయాలని ఆహార భద్రతా అధికారులను డిమాండ్ చేశారు.
కాగా ధరణికి ఆస్తమా ఉంది. ఆమెను కూల్ డ్రింక్స్ తాగకూడదని వైద్యులు చెప్పారు. ఈ వివరాలను పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదికలో, పానీయం ఆమె శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత ఊపిరాడకపోవడమే మరణానికి కారణమని చెప్పబడింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పానీయం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు పోలీసులు తెలియజేశారు. షోలవరంలోని తయారీ యూనిట్ అధికారులను త్వరలో ప్రశ్నించనున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…