రాజస్థాన్ పోలీసులు క్రూర మృగం లాంటి ఓ నిందితున్ని 24 గంటల్లోనే పట్టుకున్నారు. మొత్తం 700 మంది పోలీసులు ఎప్పటి కప్పుడు నిఘా ఉంచి నిందితున్ని ట్రేస్ చేయగలిగారు. ఓ 4 ఏళ్ల బాలికను అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితున్ని అత్యంత వేగంగా పట్టుకోగలిగారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని జైపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో సురేష్ కుమార్ (25) అనే వ్యక్తి దారిలో వెళ్తూ ఇంటి బయట ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అక్కడికి 5-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్ద ఆ బాలికపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశాడు. అయితే ఆ తరువాత అతను పారిపోయాడు.
ఈ క్రమంలో ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితున్ని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జైపూర్ రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ శంకర్ దత్ శర్మ ఆధ్వర్యంలో 700 మంది పోలీసులు రంగంలోకి దిగారు. సదరు నిందితున్ని ట్రేస్ చేశారు.
అయితే సురేష్ కుమార్ వద్ద ఫోన్ లేదు. దీంతో అతన్ని ట్రేస్ చేయడం ఒక దశలో కష్టతరం అయింది. అయినప్పటికీ స్థానికంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ల ద్వారా అతని కదలికలపై నిఘా ఉంచారు. దీంతో 24 గంటల్లోనే నిందితున్ని పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో అతన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…