ఒక ఇంట్లో రాత్రి భోజనంలో భాగంగా చేపల కూర తిన్న ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. మరో వ్యక్తి హాస్పిటల్లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదకర సంఘటన బీహార్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బీహార్లోని చాప్రాలో ఉన్న దరియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాధర్వర గ్రామంలో సోమవారం సాయంత్రం సుభాష్ రాయ్ (5) చేపల కూర వండాడు. దాన్ని తన ఇద్దరు కుమారులు బాలాజీ రాయ్ (18), మిథిలేష్ రాయ్ (22)లతోపాటు మేనల్లుడు విరాజ్ రాయ్ (5) తిన్నాడు. అయితే కూరను తిన్న వెంటనే వారి పరిస్థితి విషమించింది. దీంతో బాలాజీ, విరాజ్ ఇంట్లోనే చనిపోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ సుభాష్ మృతి చెందాడు. మిథిలేష్ విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. పాట్నాలోని ఓ హాస్పిటల్లో అతనికి చికిత్సను అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సుభాష్ ఇంటికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వంట వండిన ప్రదేశాన్ని గమనించారు. ఆ చేపల కూరను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. బహుశా ఫుడ్ పాయిజనింగ్ అవడం వల్లే వారు మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చేపల కూరను పరీక్షించాక అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…