సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. అధిక వేగంతో ప్రయాణిస్తున్న అతను అదుపుతప్పి కింద పడటంతో కన్ను, ఛాతి భాగం, భుజాలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా జరిగింది. ఎంతో వేగంగా వెళ్తున్న సాయి తేజ్ రోడ్డుపై ఇసుక ఉన్న కారణంగా అదుపుతప్పి కింద పడినట్లు పోలీసులు వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడన్న వార్త తెలియడంతో అటు మెగా కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే సాయి ధరమ్ తేజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసిన అభిమానులు అతను ఏ బైక్ నడుపుతున్నాడు, ఆ బైక్ ధర ఎంత.. అనేదానిపై అత్యుత్సాహం కనబరుస్తూ బండి గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలు పెట్టారు.
సాయి ధరమ్ తేజ్ ఉపయోగిస్తున్న బండి విషయానికి వస్తే ఈ బండిని గత కొన్ని నెలల క్రితమే హైదరాబాద్లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాయి తేజ్ ఉపయోగించే బండి ట్రయంప్ ట్రైడెంట్ కాగా, ఈ బండి ఖరీదు సుమారు రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. 660 సీసీ ఇంజన్ను కలిగి ఉన్న హై ఎండ్ బైక్ సుమారు రెండు వందల కిలోల బరువు ఉంటుంది. అయితే గత కొన్ని నెలల క్రితమే సాయిధరమ్ తేజ్ ఈ స్పోర్ట్స్ బైక్ ను TS07 GJ1258 నంబర్ పై అనిల్ కుమార్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేసి కొన్నట్టు తెలుస్తోంది. బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్న సాయి తేజ్ ఎప్పటిలాగే శుక్రవారం తన స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…