సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. అధిక వేగంతో ప్రయాణిస్తున్న అతను అదుపుతప్పి కింద పడటంతో కన్ను, ఛాతి భాగం, భుజాలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా జరిగింది. ఎంతో వేగంగా వెళ్తున్న సాయి తేజ్ రోడ్డుపై ఇసుక ఉన్న కారణంగా అదుపుతప్పి కింద పడినట్లు పోలీసులు వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడన్న వార్త తెలియడంతో అటు మెగా కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే సాయి ధరమ్ తేజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసిన అభిమానులు అతను ఏ బైక్ నడుపుతున్నాడు, ఆ బైక్ ధర ఎంత.. అనేదానిపై అత్యుత్సాహం కనబరుస్తూ బండి గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలు పెట్టారు.
సాయి ధరమ్ తేజ్ ఉపయోగిస్తున్న బండి విషయానికి వస్తే ఈ బండిని గత కొన్ని నెలల క్రితమే హైదరాబాద్లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాయి తేజ్ ఉపయోగించే బండి ట్రయంప్ ట్రైడెంట్ కాగా, ఈ బండి ఖరీదు సుమారు రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. 660 సీసీ ఇంజన్ను కలిగి ఉన్న హై ఎండ్ బైక్ సుమారు రెండు వందల కిలోల బరువు ఉంటుంది. అయితే గత కొన్ని నెలల క్రితమే సాయిధరమ్ తేజ్ ఈ స్పోర్ట్స్ బైక్ ను TS07 GJ1258 నంబర్ పై అనిల్ కుమార్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేసి కొన్నట్టు తెలుస్తోంది. బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్న సాయి తేజ్ ఎప్పటిలాగే శుక్రవారం తన స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…