ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు. అదేవిధంగా వాతావరణం కూడా కాస్త చల్లబడటంతో చాలామంది ఏదైనా ప్రాంతాలకు టూర్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విధంగా టూర్ ప్లాన్ చేసిన ఓ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపై టూర్ ప్లాన్ చేసే వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియో చూడాల్సిందే..
ఈ వీడియోలో ఓ జంట రాజస్థాన్ లోని ఉదయ్పూర్లో టూరిజం వెళ్లారు. ఈ విధంగా వెళ్లిన ఈ జంట తమ కారును రోడ్డు పక్కన ఆపి పచ్చని వాతావరణంలో సెల్ఫీ తీసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కొందరు యువకులు వారి వాహనాలను పక్కగా ఆపి ఆ జంట వద్దకు చేరుకున్నారు.అయితే అక్కడికి వెళ్ళిన యువకులు కత్తులు చూపెడుతూ వారి వద్ద ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ ఇవ్వాల్సిందిగా కోరారు. వారి దగ్గర ఏమీ లేవని చెప్పడంతో వారు కారు తాళాలు తీసుకుని కారులో విలువైన వస్తువుల కోసం వెతికారు.
కారులో ఏమీ లేక పోవడంతో వారి ఒంటిపై ఉన్న గొలుసులు, ఉంగరాలు తీసుకువెళ్లారు. అదేవిధంగా కారు తాళాలు కూడా లాక్కున్నారు. కనీసం కారు తాళాలు అయిన ఇవ్వమని సదరు మహిళ అడిగినప్పటికీ ఆ యువకులు కారు తాళాలు ఇవ్వకుండా వెళ్లారు. అయితే ఈ తతంగం మొత్తం మహిళ వీడియో చిత్రీకరించినా యువకులు ఏ మాత్రం భయపడకుండా వారి పై ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…