ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎంతో మంది పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. సాధారణంగా కొన్ని పెళ్లిళ్లలో పలు వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని వీటిలో హాస్యాస్పదంగా ఉంటే మరికొన్ని తీవ్ర వివాదాలకు కారణం అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటన యూపీలోని హమీర్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో పాల్గొన్న వధూవరుల పై వరుడు తల్లి తన కొడుకును చెప్పుతో కొట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
యూపీలోని హమీర్ పూర్ జిల్లాలో జరిగింది. కాగా, భరువా సుమేర్ పూర్ గ్రామానికి చెందిన ఉమేష్ చంద్ర, అదే గ్రామానికి చెందిన అంకిత ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలని వీరి ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్రమంలోనే వీరి ప్రేమపెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఉమేష్ అంకిత ఇంటిలో నుంచి వెళ్లిపోయి రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల పాటు ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటున్న ఈ జంటను అంకిత తల్లిదండ్రులు వారి కూతురు అల్లుడిని ఇంటికి తీసుకొచ్చి వారి వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు గ్రామస్తులు అందరినీ ఆహ్వానించారు కానీ ఉమేష్ తల్లిదండ్రులను ఆహ్వానించలేదు. దీంతో ఉమేష్ తల్లిదండ్రులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వివాహ రిసెప్షన్ లో జై మాల కార్యక్రమం సాగుతుండగా వధూవరులు ఇద్దరినీ కమలం పువ్వులాంటి సింహసనాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది చుట్టుతిరుగుతూ ఉంటుంది.ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది అతిథులు ఎంతో ఆసక్తిగా వేడుకను చూస్తుంటే ఉమేష్ తల్లి ముసుగులో వచ్చి ఉమేష్ పై చెప్పుతో దాడి చేసింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండగా.. చివరికి అక్కడున్న వారు ఆ ముసుగులో ఉన్న మహిళను కిందకు దించి ముసుగు తీసి చూడగా అందరికీ అసలు విషయం అర్థమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…