ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలను నడపాల్సి ఉంటుంది. అలాగే వాహనాల పార్కింగ్ విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. లేదంటే ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు ఫైన్ వేస్తారో తెలియదు. ఎప్పుడు వాహనాలను టోయింగ్ చేసి తీసుకెళ్తారో తెలియదు. ఆ వ్యక్తికి కూడా అలాగే జరిగింది. కానీ అక్కడే వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పూణెలోని నానాపేట్ ఏరియాలో నో పార్కింగ్ ప్లేస్లో వాహనాలను పార్కింగ్ చేసిన వారిపై అక్కడి సమర్థ్ ట్రాఫిక్ బ్రాంచ్ పోలీసులు కొరడా ఝులిపించారు. వాహనాలను అన్నింటినీ టోయింగ్ చేసి తీసుకెళ్లేందుకు ట్రాఫిక్ వ్యాన్పైకి ఎక్కించారు. అయితే వాటిల్లో ఓ టూవీలర్కు చెందిన వ్యక్తి తన వాహనాన్ని పోలీసులు తీసుకెళ్తుండడం చూసి భరించలేక ఏకంగా వ్యాన్ మీదకు ఎక్కాడు.
వ్యాన్ మీదకు అప్పటికే ఎక్కించిన తన టూవీలర్పై అతను కూర్చుని చాలా సేపు కిందకు దిగలేదు. పోలీసులు ఎన్నో సార్లు అతనికి కిందకు దిగాలని చెప్పారు. అయినప్పటికీ అతను కిందకు రాలేదు. ఇక కొంత సేపటి తరువాత అతను మనసు మార్చుకుని కిందకు దిగి ఫైన్ కట్టాడు. వాహనాన్ని అతనికి పోలీసులు అప్పగించారు. అతను క్షమాపణలు కూడా చెప్పాడు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్గా మారింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…