స్మార్ట్ ఫోన్లు అనేవి నేడు మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అవి ఒకప్పుడు విలాసవంతమైన వస్తువులు. కానీ నేడు నిత్యావసర వస్తువులుగా మారాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు ఫోన్ల వెనుక కేస్లలో కరెన్సీ నోట్లను పెట్టుకుంటారు. గమనించారు కదా. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా ? ఆ వివరాలనే ఇప్పుడు తెలుసుకుందాం.
* పర్సులు లేదా వాలెట్లలో కరెన్సీ నోట్లను పెట్టుకోవడం వల్ల లక్ కలసి వస్తుందని, అదృష్టం వరిస్తుందని నమ్మేవారు. అందుకనే కొందరు వాటిలో ఒక్క కరెన్సీ నోటును అయినా పెట్టుకుంటారు. ఇది పాత ట్రెండ్. అయితే ఇప్పుడు ఫోన్ల వెనుక కేస్లలో ఆ నోట్లను పెట్టుకుంటున్నారు. ఫోన్లను మనం ఎప్పుడూ వాడుతాం కదా. వ్యాపారం కోసం కూడా ఉపయోగిస్తుంటారు. అందువల్ల వాటి వెనుక కేస్లలో కరెన్సీ నోట్లను పెట్టుకుంటే లక్ కలసి వస్తుందని కొందరు నమ్ముతారు. అందుకనే ఆ నోట్లను వారు అలా పెట్టుకుంటారు.
* ఇక దీని వెనుక ఉన్న మరో కారణం.. పర్సు లేదా జేబులో పెట్టుకుంటే డబ్బులు పోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వాటిపై కన్నేసి ఉంచాలి. కానీ ఫోన్ను ఎప్పుడూ ఉపయోగిస్తారు కదా. కనుక దాని వెనుక పెట్టుకుంటే డబ్బును మాటి మాటికీ ఉందా, లేదా అని చెక్ చేసుకోవాల్సిన పనిలేదు. అందుకనే కొందరు అలా పెట్టుకుంటారు. అక్కడ ఉండే సేఫ్గా ఉందని కొందరు భావిస్తారు.
* ఇక కొందరు ఎమర్జెన్సీ సమయాల్లో వాడుకునేందుకు అవసరం ఉంటాయని కూడా కరెన్సీ నోట్లను ఫోన్ల వెనుక కేస్లలో పెట్టుకుంటారు.
* కొందరు తమ వద్ద ఉన్న విదేశీ కరెన్సీని ఇతరులకు చూపించడం కోసం అలా నోట్లను పెట్టుకుంటారు.
ఇలా భిన్న రకాల కారణాలతో కరెన్సీ నోట్లను ఫోన్ల వెనుక కేస్లలో పెట్టుకుంటూ ఉంటారు. ఒకప్పుడు పర్సుల్లో నోట్లను పెట్టుకునేవారు. కానీ ఫోన్ల వల్ల ఇప్పుడు ఆ నోట్లు ఉండే ప్లేస్ మారింది. అంతే తేడా..!
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…