Samantha : గతేడాది అక్టోబర్ మొదటి వారంలో నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. సమంతనే కావాలని చైతూకు విడాకులు ఇచ్చిందని.. ఆమెకు సినిమాల్లో చేయడం అంటేనే ఇష్టమని.. భర్త అంటే ప్రేమ లేదని.. ఆమెకు పిల్లల్ని కనే ఉద్దేశం లేదని.. అబార్షన్లు జరిగాయని.. ఇలా రకరకాలుగా ఆమెపై వార్తలు వచ్చాయి.
ఇక ఓ దశలో అయితే నాగచైతన్య ఇస్తానన్న రూ.250 కోట్ల భరణాన్ని కూడా సమంత కాదనుకుందని వార్తలు వచ్చాయి. అయితే వీటిన్నింటికీ ఎట్టకేలకు సమంత సమాధానాలు చెప్పింది. తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ షో సీజన్ 7 ఎపిసోడ్ 3కు సమంత.. అక్షయ్ కుమార్తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ ఆమెను ఆమె వైవాహిక జీవితానికి చెందిన ప్రశ్నలను అడిగారు. అయితే వాటికి ఎట్టకేలకు సమంత సమాధానాలు చెప్పింది.
నాగ చైతన్యతో విడిపోయిన తరువాత జీవితం ఎలా ఉంది ? అని కరణ్ జోహర్ అడగ్గా.. విడాకుల తరువాత చాలా కష్టంగా మారిందని తెలియజేసింది. కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నానని సమంత రిప్లై ఇచ్చింది. తామిద్దరం విడిపోవడం సామరస్యంగా జరగలేదని.. విడిపోయిన తరువాత చాలా మనోవేదనకు గురైనట్లు తెలియజేసింది. అయితే ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని.. భవిష్యత్లో ఏం జరుగుతుందో చెప్పలేమని తెలిపింది.
ఇక చైతూతో విడాకుల తరువాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి సమంత మాట్లాడుతూ.. నేను విడాకులు తీసుకున్న తరువాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను వాటిపై ఫిర్యాదు చేయలేకపోయాను. నేను పారదర్శకంగా ఉండాలని అనుకున్నాను. నా జీవితంలో చాలా విషయాలను వెల్లడించి విడిపోయా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి నేను పెద్దగా బాధ పడలేదు. ట్రోల్ చేసే వారు నా జీవితంపై పెట్టుబడి పెట్టారు. అప్పుడు వాటికి స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు లేవు.. అంటూ సమంత తెలిపింది.
అయితే అప్పట్లో విడాకుల కోసం రూ.250 కోట్ల భరణం తీసుకుందని వచ్చిన వార్తలపై కూడా సమంత సమాధానం ఇచ్చింది. నాకు భరణంగా రూ.250 కోట్లు వచ్చిందని పుకార్లు వచ్చాయి. అయితే అది ఎంత అబద్ధమో మీడియానే గ్రహించింది. చివరకు ఆ అబద్దాలు వాటంతట అవే వీగిపోయాయి.. అని సమంత తెలియజేసింది.
ఇక 2009లో ఏ మాయ చేశావె సినిమా ద్వారా నాగ చైతన్యతో సమంతకు పరిచయం అయింది. తరువాత ఆ పరిచయం ప్రేమగా మారి ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2017 అక్టోబర్ 6న వీరు వివాహం చేసుకున్నారు. తరువాత 4 ఏళ్ల పాటు వీరు అన్యోన్యంగా ఉన్నారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి నాగ చైతన్య గురించి సమంత ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తాజాగా విషయాలను వెల్లడించింది. దీంతో ఈమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…