Sai Pallavi : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో సాయి పల్లవి ఒకరు. అందం, అభినయంతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. సాయి పల్లవి మలయాళ చిత్రం ప్రేమమ్ తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఫిదా సినిమాలో నటించింది. ఇందులో భానుమతి పాత్రలో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టి పడేసింది. ఆ తర్వాత సాయి పల్లవికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇటు తెలుగుతోపాటు అటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవల శ్యామ్ సింగరాయ్ తో అలరించిన సాయి పల్లవి ప్రస్తుతం షూట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె రైతుగా మారింది. తన ఇంటి వద్ద ఉన్న పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ పనులు చేసింది. మిగతా కూలీలతో కలిసి పంట కోత పనుల్లో పాల్గొంది. ఈ ఫొటోలను సాయిపల్లవి ఇన్స్టా వేదికగా షేర్ చేయడంతో వైరల్గా మారాయి. ప్రస్తుతం షూటింగ్స్ నుండి గ్యాప్ దొరకడంతో సాయి పల్లవి తన ఇంటి వద్ద ఉన్న పొలాల్లోకి వెళ్ళింది. అక్కడి వ్యవసాయ కూలీలతో కలిసి పని చేసింది. అక్కడి వ్యవసాయ కూలీలు అల్లం పంటని బయటకి తీస్తుండగా సాయి పల్లవి కూడా వారితో చేరి అల్లం పంటని బయటకి తీసింది.
రోజంతా వారితో కలిసి పని చేసింది. పొలంలో ఉన్న కూలీలతో కలిసి ఫోటోలు తీసుకొని, అల్లం పంటతో ఫోటోలు తీసుకుని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సాయి పల్లవి. ఈ ఫోటోలని షేర్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఇక నెటిజన్లు, అభిమానులు, సెలబ్రిటీలు సాయి పల్లవిపై పొగడ్తలు కురిపిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సాయి పల్లవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలకు టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. హార్ట్ సింబల్ ఇచ్చింది. నీలా ఎవ్వరూ లేరు.. అంటూ శ్రద్ధా శ్రీనాథ్ ప్రశంసల వర్షం కురిపించింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…