Rashmi Gautam : బుల్లి తెర నటి, యాంకర్ రష్మి గౌతమ్ మూగజీవాల పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. వాటికి ఏమైనా అయితే ఆమె తట్టుకోలేదు. ఆమె ఎప్పుడూ జంతు సంరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనపై రష్మి గౌతమ్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీలోని జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ నీటి ఏనుగు ఉంది. దాన్ని రోజూ చాలా మంది సందర్శకులు చూస్తుంటారు. అయితే ఇటీవల ఆ నీటి ఏనుగు తన కేజ్ నుంచి తలను బయటకు పెట్టి చూస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాన్ని లోపలికి పంపించేందుకు తలపై కొట్టాడు.
ఈ క్రమంలో ఆ సంఘటనను ఓ నెటిజన్ వీడియో తీసి దాన్ని షేర్ చేశాడు. అయితే ఆ వీడియో చూసిన రష్మి ఆగ్రహానికి గురైంది. జంతువుల పట్ల జూ సిబ్బంది వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని, ఇది బాధాకరమైన విషయమని పేర్కొంది. కాగా లాక్ డౌన్ సమయంలో తాము ఇంట్లో మూడు నెలలు ఉండేందుకు ఇబ్బందులు పడ్డామని, అలాంటిది వాటిని అలా బంధించి ఉంచితే వాటికి ఎంత బాధ కలుగుతుందో చెప్పలేమని.. రష్మి తెలిపింది. ఈ క్రమంలోనే జూ ను నిషేధించాలి.. అని ఆంగ్లంలో హ్యాష్ట్యాగ్ను ఆమె జత చేసింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…